అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

Telangana News: తెలంగాణలో శని, ఆదివారాల్లో జరిగిన తీవ్ర విషాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా.. ఓ చోట ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకాడు.

Road Accidents In Telangana: తెలంగాణలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో చోట ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు, రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటలోని (Siddipet) వివేకానందనగర్ కాలనీకి చెందిన సత్యం (49) ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోగా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి కుమార్తె త్రివర్ణ హాసిని (5), కుమారుడు అన్వేష్ నందా (7). శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్ చెరువులో సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు గాలించిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడని.. అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో..

ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల (Siricilla) పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 37వ వార్డు మైసమ్మపల్లికి చెందిన బైరి అమర్ (45), స్రవంతి (40) దంపతులు తమ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అమర్ తనకున్న దుప్పట్ల వ్యాపారం చేసేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని వ్యాపారుల నుంచి దుప్పట్లు ఆర్డర్లు తీసుకుని.. తాను నేయడంతో పాటు ఇక్కడున్న మరికొందరు ఆసాములకు ఉపాధి కల్పించేవారు. ఇటీవల అప్పు చేసి ఇల్లు కొన్నారు. అప్పిచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో 4 జోడీల సాంచలను అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది..

  • జగిత్యాల సమీపంలో కరీంనగర్ - జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • కర్ణాటకలోని కలబురగి జిల్లా కమలాపుర తాలూకా మరగుత్తి క్రాస్ వద్ద శనివారం ఉదయం గూడ్స్ వ్యాన్‌ను కారు ఢీకొని భార్యాభర్తలు, కుమారుడితో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన బీడీఎల్ ఉద్యోగి భార్గవ కృష్ణప్ప, ఆయన భార్య సంగీత, వారి కుమారుడు రాఘవ్, మహబూబ్‌నగర్ జిల్లా తాడిపర్తికి చెందిన కారు డ్రైవర్ దుర్గం రాఘవేందర్‌గౌడ్‌గా  పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • ముచ్చర్ల గేట్ వద్ద ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో గేట్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Bandi Bhageerath Remand: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Embed widget