అన్వేషించండి

Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

Telangana News: తెలంగాణలో శని, ఆదివారాల్లో జరిగిన తీవ్ర విషాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా.. ఓ చోట ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి చెరువులో దూకాడు.

Road Accidents In Telangana: తెలంగాణలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ కలహాలతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో చోట ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు, రోడ్డు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేటలోని (Siddipet) వివేకానందనగర్ కాలనీకి చెందిన సత్యం (49) ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోగా రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకి కుమార్తె త్రివర్ణ హాసిని (5), కుమారుడు అన్వేష్ నందా (7). శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకుని చింతల్ చెరువులో సత్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు గాలించిన పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన సోదరుడికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చాడని.. అవి తిరిగి ఇవ్వకపోగా అవమానించడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యం గత కొన్ని రోజులుగా ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో..

ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల (Siricilla) పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 37వ వార్డు మైసమ్మపల్లికి చెందిన బైరి అమర్ (45), స్రవంతి (40) దంపతులు తమ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అమర్ తనకున్న దుప్పట్ల వ్యాపారం చేసేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని వ్యాపారుల నుంచి దుప్పట్లు ఆర్డర్లు తీసుకుని.. తాను నేయడంతో పాటు ఇక్కడున్న మరికొందరు ఆసాములకు ఉపాధి కల్పించేవారు. ఇటీవల అప్పు చేసి ఇల్లు కొన్నారు. అప్పిచ్చిన వారు ఇబ్బంది పెట్టడంతో 4 జోడీల సాంచలను అమ్ముకున్నారు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో శనివారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది..

  • జగిత్యాల సమీపంలో కరీంనగర్ - జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • కర్ణాటకలోని కలబురగి జిల్లా కమలాపుర తాలూకా మరగుత్తి క్రాస్ వద్ద శనివారం ఉదయం గూడ్స్ వ్యాన్‌ను కారు ఢీకొని భార్యాభర్తలు, కుమారుడితో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన బీడీఎల్ ఉద్యోగి భార్గవ కృష్ణప్ప, ఆయన భార్య సంగీత, వారి కుమారుడు రాఘవ్, మహబూబ్‌నగర్ జిల్లా తాడిపర్తికి చెందిన కారు డ్రైవర్ దుర్గం రాఘవేందర్‌గౌడ్‌గా  పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • ముచ్చర్ల గేట్ వద్ద ఆదివారం కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా.. మార్గమధ్యలో గేట్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget