అన్వేషించండి

Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

Kurumurthy Jatara: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మాపురంలోని కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేశారు.

Revanth Reddy visits Kurumurthy Swamy Temple | మహబూబ్‌నగర్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో పాల్గొనున్నారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి గుట్టపైకి రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కురుమూర్తి స్వామి స్వామిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్నా ఈసారి దర్శించుకోవడం ప్రత్యేకం. సీఎంగా తొలిసారి కురుమూర్తి జాతరకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారులు సీఎం రేవంత్ రెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. స్వామి వారి చిత్రపటం సీఎం రేవంత్ కు బహూకరించారు. పక్కన ఉన్న మరో ఆలయాన్ని సైతం సీఎం రేవంత్, మంత్రులు దర్శించుకుని, ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

ముగిసిన బ్రహ్మోత్సవాలు, మొదలైన కురుమూర్తి జాతర

కురుమూర్తి బ్రహ్మోత్సవాలు శుక్రవారం (నవంబర్ 9న) ముగిశాయి. శనివారం ప్రారంభమైన కురుమూర్తి జాతర దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. రెండో శనివారం  కావడంతో నవంబర్ 9న భారీ సంఖ్యలో భక్తులు కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. నేడు సెలవురోజు అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీ సంఖ్యలో కురుమూర్తి క్షేత్రానికి వచ్చారు. అధికారులు ఈ మేరకు సీఎం పర్యటనకు ఏర్పాటు చేశారు. 


Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి- ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన

సొంత జిల్లా పాలమూరు (ఉమ్మడి జిల్లా)లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కావడంతో కురుమూర్తి దేవాలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలతో పాటు భారీగా సిబ్బంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని చిన్నచింతకుంట ఎస్ఐ ఆర్.శేఖర్ తెలిపారు.

పర్యటనకు హెలికాప్టర్ క్యాన్సిల్
సీఎం రేవంత్ రెడ్డి కురుమూర్తి పర్యటన రెండు రోజుల కిందట ఖరారయింది. మొదట ఆయన హెలికాప్టర్ ద్వారా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి క్షేత్రానికి వస్తారని అధికారులు తెలిపారు. అందుకు అమ్మాపూర్ సమీపంలో హెలిప్యాడ్​ను సైతం అధికారులు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. అనివార్య కారణాల హెలీకాప్టర్​ను క్యాన్సిల్ చేయగా... సీఎం రేవంత్, మంత్రులు రోడ్డు మార్గాన చేరుకుని కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

iPhone 17 Sales Rush: ఐఫోన్ 17 ఫోన్ల కోసం యాపిల్ సెంటర్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న ఐఫోన్ కస్టమర్లు Viral Video
ఐఫోన్ 17 ఫోన్ల కోసం యాపిల్ సెంటర్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న కస్టమర్లు Viral Video
Rahul Gandhi: భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
Advertisement

వీడియోలు

ఆసియా కప్ నుంచి ఆఫ్ఘన్ ఔట్.. సూపర్-4 లో ఇండియా షెడ్యుల్ ఫైనల్
ఆ వీడియో ఎలా బయటపెడతారు?.. పీసీబీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్!
టీమ్ జెర్సీలోనూ పీసీబీ కక్కుర్తి.. అవినీతి బయటపెట్టిన పాక్ మాజీ
టీమిండియాలో 3 మార్పులు.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!
India vs China Water war | చైనా మెగా డ్యాంకి ఇండియా కౌంటర్ ప్లాన్ అదుర్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iPhone 17 Sales Rush: ఐఫోన్ 17 ఫోన్ల కోసం యాపిల్ సెంటర్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న ఐఫోన్ కస్టమర్లు Viral Video
ఐఫోన్ 17 ఫోన్ల కోసం యాపిల్ సెంటర్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న కస్టమర్లు Viral Video
Rahul Gandhi: భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
Sai Durgha Tej: తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
తలకు హెల్మెట్ వల్లే ప్రాణాలతో బయటపడ్డా - ఫైన్, కౌన్సెలింగ్ కాదు స్మాల్ పనిష్మెంట్... ట్రాఫిక్ సమ్మిట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Gold Seized at Shamshabad airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు నిందితు అరెస్ట్
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు ఏపీ వ్యక్తుల అరెస్ట్
Embed widget