అన్వేషించండి

Eluru Murder Arrest: తమ్ముడ్ని చంపేసిన అన్న వదినలు - పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి

Eluru News: భూ త‌గాదాల నేప‌థ్యంలో త‌మ్ముడిని అన్న వదిన‌, కుమారులు చంపేశారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

ఏలూరు జిల్లా, నూజివీడు మండం, సుంకొల్లు గ్రామంలో భూ తగాదా విషయంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ హ‌త్య‌కు దారితీసింది. ఈ ఘ‌ట‌న‌లో సొంత త‌మ్ముడినే అన్న‌, వ‌దినతో పాటుగా కుమారులు క‌ల‌సి హ‌త్యచేసిన‌ట్లుగా పోలీసులు నిర్దారించారు. నలుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల మధ్యలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన తమ్ముడు సింహాద్రి రవి కుమార్ హత్య కేసులో నిందితుల వివ‌రాల‌ను పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో అరెస్టు అయిన‌ నిందితులు, మృతుడు రవి కుమార్ కు సొంత అన్న, వదిన మరియు అన్న కుమారులు కావ‌టం కొస‌మెరుపు. భూమి తగాదాల విషయంలో మృతుడిని కర్రలతో కొట్టి చంపేసిన‌ట్లుగా నిందితులు అంగీక‌రించార‌ని పోలీసులు తెలిపారు. అన్నదమ్ముల మధ్య  భూమి వివాదం, కారణంగానే  హత్య జరిగింద‌ద‌ని, ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని పోలీసులు తెలిపారు.

నూజివీడు రూరల్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సుంకొల్లులో జరిగిన రవి కుమార్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన విషయం, హత్యకు దారితీసిన కారణాల‌ను నూజివీడు DSP, బుక్కాపురం శ్రీనివాసులు తెలిపారు. మృతుడు సింహాద్రి రవి కుమార్, తండ్రి సింహాద్రి వెంకటేశ్వరరావు తన కొడుకులు సింహాద్రి రామకృష్ణరావు, సింహాద్రి మురళీ మోహన్, సింహాద్రి రవి కుమార్ మరియు కూతురు శివ నాగేంద్రమ్మలకు చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని వాటాలుగా పంచి ఇచ్చారు.

అయితే పంప‌కాల విషయంలో సుమారు 3 సంవత్సరాల‌ నుండి  అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల వాళ్ళు గ్రామంలో పెద్దలు ఎవ్వరూ చెప్పినా  వినకుండా తరచూ గొడవలు పడుతూనే ఉన్నారు. జూన్ 14న  ఉదయం సుమారు 6 గంటల సమయంలో మృతుడు సింహాద్రి రవి కుమార్ తన గడ్డివాము దగ్గరకు గడ్డి తీసుకుని రావడానికి వెళ్ళగా అక్కడ ఉన్న సింహాద్రి రామకృష్ణారావు, అతని భార్య సింహాద్రి అలివేలు మంగమ్మ వారి కుమారులు సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి వంశీకృష్ణ లు మృతుడు సింహాద్రి రవి కుమార్ తో  మరియు అతని కొడుకు కార్తీక్ తో భూమి తగాదా విషయములో ఒకరికొకరు గొడవ ప‌డ్డారు.

గొడ‌వ పెద్దది కావ‌టంతో  కర్రలతో కొట్టి సింహాద్రి రవి కుమార్ ను హత్య చేశారు. మృతుడి కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నూజివీడు రూరల్  పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేశారు. ఏలూరు జిల్లా SP రాహుల్ దేవ్ శర్మ, ఆదేశాల‌తో ప్ర‌త్యేక బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి. జూన్ 15 మధ్యాహ్నం 3 గంటలకు యలమండల గ్రామ చెక్ పోస్ట్ వద్ద సింహాద్రి రవి కుమార్ ని హత్య చేసినటువంటి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను విచారణ జరపగా భూ వివాదం కారణంగా తరచూ మృతుడు రవి కుమార్ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడ‌ని నిన్న జరిగిన ఘర్షణలో మృతుడిని కొట్టి  హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించార‌ని ఒప్పుకున్నారు. హ‌త్య‌కు ఉప‌యోగించిన మూడు కర్రలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నిందితులు నలుగురిని కోర్ట్ లో హాజరుపరుస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget