అన్వేషించండి

AR Constable Controversy: డిస్మిస్ కానిస్టేబుల్ భాను ప్రకాశ్ కు మద్దతుగా నిలిచిన మహిళపై వేధింపులు!

AR Constable Controversy: ఏఆర్ కానిస్టేబుల్ భాను ప్రకాష్ కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటిపై.. ఆమె మాజీ భర్త దాడికి దిగాడని, మద్దతుగా నిలవాల్సిన పోలీసులు తనను వేధించారని లక్ష్మీ వాపోతుంది. 

AR Constable Controversy: డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్‌ గొడవ రోజురోజుకు ముదురుతోంది. ఆయనకు అనుకూలమైన సాక్ష్యం చెప్పిన లక్ష్మీ అనే మహిళ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త హల్ చల్ చేశాడు. విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నప్పటికీ.. మాజీ భర్త వేణు గోపాల్ రెడ్డి, బావ నారాయణ రెడ్డిలు గొడవకు దిగినట్లు లక్ష్మీ చెబుతున్నారు. అర్ధరాత్రి తన ఇంటిపై దాడి చేసేందుకు వచ్చిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు కూడా అతడికే మద్దతిస్తున్నారని లక్ష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు. న్యాయం చేయాల్సిన పోలీసులే తమ ప్రాణాలు తీసేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. మరోవైపు పోలీసులు మాత్రం.. డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వచ్చామని చెబుతున్నారు. విడాకుల నోటీసు చూపించడంతో గొడవ చేసేందుకు వచ్చిన ఇద్దరిని పీఎస్ కు తరలించినట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..?
దళితుడిననే ఉద్దేశంతో... చిన్న చూపుతో కుట్ర పూరితంగానే తనను అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ విధుల నుంచి తప్పించారని ఆరోపించారు భానుప్రకాశ్‌. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై ఫిర్యాదు చేశారు. ఎస్పీతోపాటు సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ధర్మవరం డీఎస్పీ రమకాంత్, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు నలుగురి మీద మీద ఫిర్యాదు చేసినట్లు భాను ప్రకాశ్‌ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా తనకు న్యాయం చేయాలని కోరారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తనకు మద్దతు తెలపాలని కోరారు ప్రకాశ్‌. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కర్ణాటక మద్యం ఇక్కడకు తెప్పించి సొమ్ము చేసుకుంటున్నారని.. బళ్లారిలో 3 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇళ్లు కట్టిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అందులో భాగంగా రాయదుర్గం నుంచి ఒక సీఐని వీఆర్‌కు బదిలీ చేశారని ఆరోపించారు. ఎక్కువ మోతాదులో మద్యం తరలిస్తుండగా సీఐ పట్టుకున్నారని అందుకోసం అతన్ని బదిలీ చేసినట్టుగా తెలిసిందని ఆయన మీడియాకు తెలిపారు. అయితే భాను ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా అనంతపురం టు టౌన్ పోలీసులు ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ, డీఎస్పీలపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సీఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. 

ఎస్పీ ఫక్కీరప్పతో పాటు మరో ఇద్దరిపై ఆరోపణలు.. 
ఎస్పీ, డీఎఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు. సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులను కాపాడాలని.. భాను ప్రకాశ్‌ ప్లకార్డు ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాత కేసులను తిరగదోడి తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు భాను ప్రకాశ్‌ ఆరోపించారు. మూడ్రోజుల కిందట భాను ప్రకాశ్‌.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పతోపాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా సహా మరికొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

భాను ప్రకాష్ పై పలు రకాలు కేసులున్నాయి.. 
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపినందుకే ప్రకాశ్‌ను సర్వీస్ నుంచి తొలగించారని కొన్ని పార్టీలు ఆరోపించడం సరికాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు 2018లో లక్ష్మీ అనే మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగానే కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను డిస్మిస్ చేశామని అన్నారు. మరే ఇతర కారణాల వల్ల అతడిపై ఈ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే ప్రకాశ్‌పై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఓ మహిళతో అనుచిత ప్రవర్తన, మహళా హోంగార్డును వేధించిన కేసులూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు వాయిదా, ఛార్జి మెమోలతో పాటు 8 పనిష్మెంట్లు ఉన్నాయన్నారు. 

30 రోజుల్లోగా కోర్టుకు వెళ్లొచ్చు.. 
2018లో ఘటన జరిగితే బాధితురాలు 2019 జులైలో స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారని.. దాని ఆధారంగానే డీఎస్పీతో మూడేళ్ల పాటు విచారణ జరిపించామని వివరించారు. 45 రోజుల వ్యవధిలో మూడు నోటీసులు పంపించామని తెలిపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు. తన వాంగ్మూలాన్ని మార్చారాని బాధితురాలు ఇప్పుడు చెప్పడం సరికాదన్నారు. ఆమె మీడియాకు చూపించిన ఫిర్యాదు ప్రతులకు, ఈ చర్యలకు సంబంధం లేదని అన్నారు. తనకు అన్యాయం జరిగిందని భాను ప్రకాశ్‌ భావిస్తే... 30 రోజల్లోగా అప్పీల్‌కు వెళ్లవచ్చని సూచించారు. పోలీసులు శాఖపై నిందలు వేయడం మానుకోవాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget