అన్వేషించండి

Ford India: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. ఫోర్డ్ ఉద్యోగుల‌కు త్వరలో ఊర‌ట‌!

మ‌న‌దేశంలో కార్ల త‌యారీని నిలిపివేస్తున్న‌ట్లు ఫోర్డ్ ప్ర‌క‌టించింది. దీంతో ఫోర్డ్ చెన్నై యూనిట్లోని 2,600 మంది ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డ్డాయి. వీరికోసం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది.

ఆటో దిగ్గ‌జం ఫోర్డ్ భార‌త‌దేశంలో కొత్త కార్ల త‌యారీని నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ సంస్థ యూనిట్ల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల భ‌విష్య‌త్తు డోలాయ‌మానంలో ప‌డింది. చెన్నైలోని ఫోర్డ్ మోటార్ ఫ్యాక్టరీలో 2,600 మంది వ‌ర‌కు ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే వీరికోసం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఒక ముంద‌డుగు వేసింది.

ఈ ప్లాంట్ ను టేకోవ‌ర్ చేసేందుకు ఫోర్డ్, మ‌రో కంపెనీ మ‌ధ్య‌ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు త‌మిళనాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక‌వేళ వారి మ‌ధ్య డీల్ కుదిరితే ఆ స్థ‌లం పంప‌కం సులువుగా జ‌రిగేలా చేస్తామ‌ని పేర్కొంది. గ‌తేడాది ఓలా, మ‌హీంద్రా వంటి కంపెనీల‌తో ఫోర్డ్ ఈ విష‌యంపై చ‌ర్చ‌లు సాగించింది. ఇప్పుడు కూడా అవే కంపెనీల‌తో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయా లేదా ఇవి కొత్త కంపెనీలా అనే విష‌యం తెలియ‌రాలేదు.

ఈ యూనిట్లో మొత్తంగా 2,600 మంది వ‌ర‌కు ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. అయితే శుక్ర‌వారం వినాయ‌క చ‌వితి సంబ‌రాల కార‌ణంగా యూనిట్ ను మూసివేశారు. ఫోర్డ్ మాత్రం త‌మ‌కు భార‌త‌దేశాన్ని విడిచి వెళ్లే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేసింది. సోమ‌వారం యాజ‌మాన్యంతో మీటింగ్ ఉంద‌ని, వారేం చెప్తారో అని వేచి చూస్తున్న‌ట్లు ఉద్యోగుల సంఘం ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల భ‌విష్య‌త్తు గురించే తాము కూడా ఆలోచిస్తున్న‌ట్లు వారు పేర్కొన్నారు.

Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. ధ‌ర రూ.14 వేల‌లోపే.. రియ‌ల్ మీ సూప‌ర్ ట్యాబ్లెట్!

ఉద్యోగుల కోసం కంపెనీ తీసుకునే నిర్ణ‌యాలు విన‌డానికి తాము ఎదురుచూస్తున్నామ‌న్నారు. ప్లాంట్ ను కొత్త‌ కంపెనీల‌కు అందించి కొన్ని ఉద్యోగాల‌ను అయినా కాపాడితే బాగుంటుంద‌ని వారు అభిప్రాయ‌పడుతున్నారు. కంపెనీ మీద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలా వ‌ద్దా అనే నిర్ణ‌యం సమావేశం త‌ర్వాత తీసుకుంటామ‌ని తెలిపారు.

చెన్నై న‌గ‌రానికి 45 కిలోమీట‌ర్ల దూరంలోని మ‌రైమ‌లై న‌గ‌ర్ లో ఈ ప్లాంట్ ను ఫోర్డ్ స్థాపించింది. సంవ‌త్స‌రానికి 2 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను తయారుచేయగల సామ‌ర్థ్యం ఈ ప్లాంట్ కు ఉంది. ఇందులో ఫోర్డ్ వేల కోట్ల‌ రూపాయల పెట్టుబ‌డుల‌ను పెట్టింది. ఒకానొక ద‌శ‌లో ఇక్క‌డ తయారైన కార్ల‌ను ఫోర్డ్ 37 దేశాల‌కు ఎగుమ‌తి చేసింది.

Also Read: వన్​ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..

దీంతోపాటు ఫోర్డ్ కు గుజ‌రాత్ లోని స‌నంద్ లో కూడా ఇంకో ఫెసిలిటీ ఉంది. ఏటా 2.4 ల‌క్ష‌ల వాహ‌నాల‌ను, 2.7 ల‌క్ష‌ల ఇంజిన్ల‌ను రూపొందించే సామ‌ర్థ్యం ఈ ఫెసిలిటీకి ఉంది. ఇందులో కూడా ఫోర్డ్ భారీగా ఇన్వెస్ట్ చేసింది.  ఫోర్డ్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో 4 వేల మంది ప్ర‌త్య‌క్ష ఉద్యోగుల‌తో పాటు.. కంపెనీకి సంబంధించి వివిధ డీల‌ర్ల వ‌ద్ద ప‌నిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగాలు కూడా ప్ర‌మాదంలో పడ్డాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match HighLights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 9వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీPBKS vs RCB Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
MI vs CSK Highlights: సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
Odela 3: 'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
'ఓదెల 3' ట్విస్ట్ రివీల్ చేసిన సంపత్ నంది... తిరుపతి ఆత్మ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే?
CM Revanth Reddy: త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Telugu TV Movies Today: బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
బాలయ్య ‘వీరసింహారెడ్డి’, మహేష్ ‘దూకుడు’ to రామ్ చరణ్ ‘చిరుత’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వరకు- ఈ సోమవారం (ఏప్రిల్ 21) టీవీలలో వచ్చే సినిమాలివే
EX MP GV Harsha kumar: చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ 1000 రెట్లు బెటర్ - మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం
Embed widget