అన్వేషించండి

Electric Vehicles: భారత EV మార్కెట్లో తగ్గుతున్న వృద్ధి.. ఆసక్తి ఉన్నా కొనుగోళ్లకు అడ్డంకి ఇదేనా!

EV charging Stations | భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఎందుకు తగ్గుతోంది? షోరూమ్‌ల గురించి, టెక్నికల్ సమస్యలే కాకుండా, కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన కారణాన్ని కొత్త నివేదిక వెల్లడించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరలు పెరిగినా, ఈవీ అమ్మకాల వృద్ధి ఆశించినంతగా లేదు.
  • ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది.
  • అపార్ట్‌మెంట్లలో ఛార్జర్ అనుమతులు, సరికాని ఛార్జింగ్ భద్రతా ప్రమాదాలు సమస్యలు.

నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా భారత్‌లోనూ కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగింది. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఆస్తి చూపుతున్నప్పటికీ.. మార్కెట్లో దీని వేగం కొద్దిగా మందగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇష్టపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో వృద్ధి కనిపించింది. ప్రస్తుతం వృద్ధి రేటు ఆశించినంత లేవని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. 

ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారత మార్కెట్లో ఈవీ (EV) అమ్మకాల వేగం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం సాంకేతిక లోపం ఏమీ కాదు, కానీ ఇళ్లలోని బలహీనమైన ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హోమ్ ఛార్జింగ్‌కు స్థలం లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఆశించినంతగా లేవు. ఈ సౌకర్యం మెరుగైతే, ఎక్కడ పడితే అక్కడ బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటే విక్రయాల్లో ఊహించని మార్పులు సాధ్యమే.

ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేదు
 భారత్‌లో జరిగే ఈవీ విక్రయాలలో దాదాపు 91 శాతం వాటా టూవీలర్, త్రీ వీలర్ వాహనాలదే ఉంది. వీటికి ఇంట్లోనే హోమ్ ఛార్జింగ్ చేసుకోవడం చాలా అవసరం. కానీ, దేశంలో ఈవీ కొనాలనుకునే కస్టమర్లలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంట్లో వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

Also Read: జులై 2026 కార్ లాంచ్‌లు ఇవే - మారుతి, హోండా, స్కోడా, MG కొత్త కార్లపై భారీ అంచనాలు

మిగిలిన వారు తమ వాహనాన్ని ఛార్జ్ చేసుకోవడానికి పబ్లిక్ స్టేషన్లపై ఆధారపడుతూ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హోమ్ ఛార్జింగ్‌కు సంబంధించిన ఈ పెద్ద లోపం కారణంగా మరింత మందికి ఈవీ చేరువ కాలేకపోతోంది. 

అడ్డంకిగా మారిన ఎన్ఓసీ
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. అపార్ట్‌మెంట్లు, సొసైటీలు, అద్దె ఇళ్లలో నివసించే 70 నుండి 75 శాతం పట్టణ కుటుంబాలకు ఇబ్బందులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కామన్ పార్కింగ్ స్థలం ఉంటుంది. అక్కడ సొంత పర్సనల్ ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం. ఛార్జర్ ఇన్‌స్టాల్ చేయడానికి యజమానులు,  రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) నుండి అనుమతి లేదా ఎన్‌ఓసి తీసుకోవలసి ఉంటుంది. దాంతో దరఖాస్తులు చేసుకుని పర్మిషన్ కోసం ఎదురుచూడక తప్పదు. విద్యుత్ కంపెనీల నుండి మీటర్ లోడ్ పెంచడం కూడా సామాన్యులకు తలనొప్పి లాంటిదే. దీనివల్ల ప్రజలు విసిగిపోయి ఈవీ కొనే ప్లాన్‌ను వదిలేసుకుంటున్నారు.

బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం
ఎలక్ట్రిక్ వాహనం కోసం ఇంట్లో సరైన సెటప్ లేకపోతే చాలా మంది విధిలేక ప్రత్యామ్నాయ మార్గాల సహాయం తీసుకుంటున్నారు. ప్రజలు తమ బాల్కనీ లేదా కిటికీ నుండి పొడవైన ఎక్స్‌టెన్షన్ బోర్డులను వేలాడదీసి లేదా ఏదైనా సాకెట్ల నుంచి ఈవీలను కనెక్ట్ చేస్తున్నారు. సాధారణ సాకెట్లు నిరంతరం చాలా గంటల పాటు ఈవీ భారీ లోడ్‌ను తట్టుకోలేవు. 

ఈ కారణంగా వైర్లు కరిగిపోవడం, మంటలు చెలరేగడం, వోల్టేజ్ హెచ్చుతగ్గుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లక్ష్యం వాహనంలోని ఖరీదైన బ్యాటరీని డ్యామేజ్ చేయడంతో పాటు ఇంటి భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశాలున్నాయి. ఈ కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నా, ఆశించిన వృద్ధి కనిపించడం లేదు.

Also Read: ఏ కాంపాక్ట్ SUVకి లేని శక్తితో వచ్చిన టాటా సియరా EV!బేసిక్‌, టాప్‌ వేరియంట్‌ ధరలు ఎలా ఉన్నాయి?

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల వేగం ఎందుకు మందగిస్తోంది?

ఇళ్లలో బలహీనమైన ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హోమ్ ఛార్జింగ్‌కు స్థలం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ సమస్యలు ఈవీ అమ్మకాల వృద్ధిని ఆశించినంతగా లేకుండా చేస్తున్నాయి.

ఎంత శాతం ఈవీ కస్టమర్లకు ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంది?

దేశంలో ఈవీలు కొనే కస్టమర్లలో కేవలం 55 శాతం మందికి మాత్రమే తమ ఇళ్లలో వాహనాన్ని ఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. మిగిలిన వారు పబ్లిక్ స్టేషన్లపై ఆధారపడుతున్నారు.

పట్టణ ప్రాంతాల్లో నివసించే ఈవీ యజమానులు ఛార్జింగ్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?

అపార్ట్‌మెంట్లు లేదా సొసైటీల్లో నివసించే వారు పర్సనల్ ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడానికి RWA అనుమతి తీసుకోవాలి. విద్యుత్ కంపెనీల నుండి మీటర్ లోడ్ పెంచడం కూడా కష్టంగా ఉంటుంది.

ఇంట్లో సరైన పద్ధతిలో ఛార్జ్ చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి?

సాధారణ సాకెట్లు లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డులతో ఛార్జ్ చేస్తే వైర్లు కరిగిపోవడం, మంటలు చెలరేగడం, బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఇంటి భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త Bajaj Pulsar 125లో 4 వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
కొత్త Bajaj Pulsar 125లో ఏ వేరియంట్ కొనాలి? రూ.11,500 తేడాలో మారే ఫీచర్లు ఏంటి?
రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోసం ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.2 లక్షలు చెల్లిస్తే Maruti Brezza Top Model కోసం ప్రతినెలా EMI ఎంత కట్టాలి
కారుకు CNG కిట్ పెట్టిస్తే ఎంత ఖర్చవుతుంది? పోలీసులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఇబ్బందులు వస్తాయా?
మీ కారుకు ఎలాంటి CNG కిట్ పెట్టించాలి, ఎంత ఖర్చవుతుంది? మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి!
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ నెలలో లాంచ్‌ కాబోతున్న ఈ కార్లపై ఓ లుక్కేయండి!
కొత్త కారు కొనేవాళ్లకు పండగే! మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ సహా 4 మోడళ్లు లాంచ్‌కు రెడీ
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Pezeshkian Meeting: యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో PM Modi కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
High Tension At BJP Office: బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Viral News: కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
Musarambagh High Level Bridge: మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
Dhamaal 4 OTT : అడవిలో వందేళ్ల నిధి రహస్యం - ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధమాల్ 4... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అడవిలో వందేళ్ల నిధి రహస్యం - ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ధమాల్ 4... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
CM Chandrababu Emotional: వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద చంద్రబాబు భావోద్వేగం.. కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసిన ఏపీ సీఎం
వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద చంద్రబాబు భావోద్వేగం.. కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసిన ఏపీ సీఎం
Embed widget