అన్వేషించండి

Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

Indians Died | ఉక్రెయిన్ తీరంలో గినియా-బిస్సావు నౌకపై రష్యా చేసిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించగా, నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉక్రెయిన్ తీరం వదిలిన వాణిజ్య నౌకపై రష్యా క్షిపణి దాడి.
  • ఈ దాడిలో నలుగురు భారతీయులు సహా పదిమంది మృతి.
  • భారత్ తీవ్రంగా ఖండించి, రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ.

Russia Attacks Ukraine | ఉక్రెయిన్ తీరం నుండి బయలుదేరుతున్న గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై రష్యా దాడి చేసింది. నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయ పౌరులతో సహా మొత్తం 10 మంది మృతిచెందారు. భారతీయులు మృతిచెందిన ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఘర్షణ, ఉద్రిక్తతల సమయంలో మరోసారి వాణిజ్య నౌకల భద్రతపై భయాందోళన నెలకొంది. 

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా రష్యా చేసిన దాడిపై స్పందించారు. రష్యా ఆదివారం నాడు ఉక్రెయిన్ సముద్ర కారిడార్ నుంచి వెళ్తున్న ఒక నౌకపై దాడి చేసింది. ఆ నౌక సిబ్బందిలో సిరియా, భారత పౌరులు ఉన్నారని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌కు చెందిన నావికులు, సిబ్బంది చనిపోయిన తొలి ఘటన ఇది. 

 నౌకపై రష్యా మిస్సైల్స్ దాడి చేసింది: ఉక్రెయిన్

గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న నౌకపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఎం.వి. గోల్డెన్ లియో అనే ఈ వాణిజ్య నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది, సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురు భారత పౌరులు ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేయడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు నివారించాలి అని పేర్కొంది.

Also Read: Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే

రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన భారత విదేశాంగశాఖ

ఉక్రెయిన్‌లోని ఒడెసా రేవులో ఓ నౌకపై జరిగిన దాడిలో భారతీయులు మృతిచెందడంపై రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. నౌకపై దాడికి సంబంధించి రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు భారత్ తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

ఈ దాడిపై స్పందించిన MEA ఏం చెప్పింది?

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిపై స్పందించింది. ' ఆదివారం (జూలై 19) సాయంత్రం, ఎంవి గోల్డెన్ లియో ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రష్యా దాడి చేసింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దురదృష్టవశాత్తు నలుగురు భారత పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని' తెలిపింది.

ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రభావిత వారికి  సాధ్యమైన అన్ని రకాల సహాయం చేయడానికి  ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  మృతిచెందిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన భారత పౌరుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

 రష్యా పేరును ప్రస్తావించని భారత్
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యా పేరును నేరుగా ప్రస్తావించలేదు.  'భారత్ ఇటువంటి దాడులను ఖండిస్తుంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం లేదా షిప్పింగ్, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దేశం కూడా అలా దాడులు చేయకూడదు' అని స్పష్టం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులు బలైపోవడం సరికాదని పేర్కొన్నారు.

Frequently Asked Questions

దాడికి గురైన వాణిజ్య నౌక ఏ దేశం జెండాతో ప్రయాణిస్తోంది?

నౌక గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తోంది. దీని పేరు ఎం.వి. గోల్డెన్ లియో.

ఈ దాడిలో ఎంతమంది భారతీయులు మరణించారు?

ఈ దాడిలో నలుగురు భారతీయ పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడిపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది?

భారత ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించింది. రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

దాడి ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

ఈ దాడి జూలై 19 సాయంత్రం, ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం నుండి బయలుదేరుతుండగా జరిగింది. రష్యా క్షిపణులతో దాడి చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget