అన్వేషించండి

AP Politics: నిన్నటి వరకూ బూతులు.. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?

ఏపీ రాజకీయ పార్టీలన్నీ బూతుల దశను దాటి దాడులకు వచ్చాయి. వాటి తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. సమీక్షించుకుని పరిస్థితులు మార్చకపోతే భవిష్యత్ తరాలకు చెడు సంప్రదాయాలు ఇచ్చినట్లవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మెట్టు దిగజారాయి. ఇంతకన్నా దిగజారడానికి ఇంకేం లేదు అనుకున్న ప్రతిసారీ మరోమెట్టు పడిపోతున్నాయి. మామూలుగా మనం ప్రతిరోజూ స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటాం. ఇన్ని పాయింట్లు పెరిగింది..అంత పడిపోయింది.. అని... ఇప్పుడు ఏపీ గురించి కూడా అదే చెప్పుకోవాలేమో. ఇంత పడిపోతున్నాయి.. నాయకులు ఏ స్థాయికి పడిపోతున్నారు అని... గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అందరూ శాకాహారులే.. కానీ బుట్టలో చేపలు మాత్రం మాయం అయిపోయినట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి.. ఎవరకి వారు మేం ఉత్తములమే... అవతలివారిదే తప్పు అన్నట్లు ఉన్నారు. ఎవరికి వాళ్లు వీళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాగే బిహేవ్ చేస్తున్నారు కానీ.. ప్రజలు ఏం అనుకుంటున్నారో.. ఎవరికీ పట్టడంలేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఇంకా ఎంత దిగజారుతుంది.. దిగజారనుంది? ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వారంటే లెక్కలేనట్లుగా ప్రతిపక్షం ప్రవర్తిస్తుందా.. ?  ప్రతిపక్షంలో ఉన్న వారితో సంబంధం లేనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తుందా... వారికి ముఖ్యమంత్రి కానట్లు జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తారా...? అధికారంలో ఉన్న వారు పార్టీ స్థాయిలో జరగాల్సిన రాజకీయ స్పందనకు పరిపాలన మధ్య గీత ఎందుకు గీయ లేకపోతున్నారు?.

Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్

టీడీపీ అధికార ప్రతినిధి సంయమనం కోల్పోయి... పరుష పదజాలంతో విమర్శలు చేశారు. అవి ఎంతమాత్రం సమర్థనీయం, వాంఛనీయం కాదు. కానీ దానికి వచ్చిన రియాక్షన్ అంతకంటే సమర్థించేది కాదు. పూర్తిగా పక్కా ప్లాన్‌తో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగింది అని విజువల్స్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్లు ఏ పార్టీ వాళ్లు అన్నది ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. కానీ దీనిపై స్పందించిన ఆయా రాజకీయ పక్షాలు రెండూ కూడా వాళ్లు చేసిన తప్పులు గురించి మాట్లాడకుండా... ఎదుటివాళ్ల తప్పుల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ శ్రేణులు దాడులు గురించి మాట్లాడే టీడీపీ వాళ్లు పట్టాభి వ్యాఖ్యలు తప్పు... అని మాటవరుసకు కూడా అనలేదు. ఆ మాటకొస్తే ఇన్నాళ్లూ వైసీపీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి అని టీడీపీ వాళ్లు అడుగుతారు. అది వాస్తవమే కాబట్టి దాన్ని ఎవరు కౌంటర్ చేయలేరు. కానీ ఇన్నాళ్లు వైసీపీ భాష దారుణంగా ఉంది... బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్తూ వస్తున్న టీడీపీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయింది.  

ఇక వైసీపీ స్పందన మరింత ఘోరంగా ఉంది. కొంతమంది నేతలు గొంతులు కోస్తాం అన్నారు. కొంతమంది మంత్రులు చర్మాలు తీస్తాం అన్నారు. ఇక దానికి అదుపులేదు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్.., శాంతిభద్రతలకు బాధ్యతగా ఉన్న డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలే సమర్థనీయంగా లేవు. 

శాంతిభద్రతల అంశాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దాడులను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం మారుతున్న రాజకీయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్లకి బీపీ వస్తుంది... రేపు అధికారంలోకి వచ్చే వారికీ బీపీ రాకుండా ఉంటుందా..? అలా బీపీలు తెచ్చుకుని దాడులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ? ముఖ్యమంత్రికి అభిమానులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండకూడదు. జగన్ మోహనరెడ్డికి ఉండొచ్చు. కానీ... జగన్ మోహనరెడ్డి అభిమానులు ఎవరిపైన అన్నా దాడి చేసినప్పుడు.. ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన విధానం వేరుగా ఉండాలి. సీఎం రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఎవరిపైన అయినా దాడులు జరిగినప్పుడు వాటిని నివారించేలా మాట్లాడితే బాగుంటుంది. అవతలి వారిది తప్పు ఉండొచ్చు దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అంతే తప్ప దాడులను గ్లోరిఫై చేసేలా మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవ్వదు. మూకస్వామ్యం అవుతుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను గౌరవించాలి. రాజకీయంగా వారికి జగన్ శత్రువు కావొచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థానానికి ఒక గౌరవం ఇవ్వాలి.  
Also Read : ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్

అది ప్రజాస్వామ్యం కాదు ! 

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో రాజకీయాలు పూర్తి స్థాయిలో ఇదేనా ప్రజాస్వామ్యం అనేలా మారాయి. మీరు బూతులు తిడున్నారంటే.. మీరు బూతులు తిడుతున్నార ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. రెండు పార్టీల నేతలు మీరు ఒకటి అంటే.. మేము పది అనగలమని తిట్టుకున్నారు. ఇప్పుడు దాడుల దశకు వచ్చేశారు. వ్యవస్థీకృతంగా జరిగిన దాడులను చూసిన తరవాత ఎవరికైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ఓ రకమైన ఆందోళన ఏర్పడటం సహజం. ఏపీ పరిణామాలు అదే అభిప్రాయాన్ని కల్పించాయి. విమర్శిస్తే వెళ్లి దాడులు చేయడమేనా..?  ప్రతిపక్ష పార్టీలకు రక్షణ ఉండదా..?. ఇలా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా.. ? అనేది అందరికీ వచ్చిన సందేహం. 

రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి. అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టడం.. కొట్టాడనికి వెళ్లడం.. దాడులు చేయడం రాజకీయం కాదు. కానీ ఇప్పుడు ఇదే రాజకీయంగా మారిపోయింది. మాటకు మాట.. దెబ్బకు దెబ్బతీయకపోతే వాడిని చేతకాని వాడిగా జత కట్టేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చేసింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అసలు అనుకోరు. ఒకరు తమలపాకుతో ఒకటి అంటే మరొకరు తలుపుచెక్కతో రెండు అంటారు. అది అలా పెరిగిపోతూనే ఉంటుంది. చివరికి ఎక్కడకు చేరుతుందో అంచనా వేయడం కష్టం. ఇదంతా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం తెచ్చిపెట్టేదే. 

Also Read : టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు

 ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్న పార్టీలు ! 

ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పాత్రను చాలా తక్కువగా రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లేయరని భావిస్తున్నారు. అందుకే గీత దాటిపోతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు ఓ మాదిరి హద్దు దాటినా ప్రజల్లో విస్తృత చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అందరు నేతలు అదే బాట పట్టారు. చివరికి  ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శుత్రత్వ స్థాయి దాడుల వరకూ వెళ్లింది. ఎదురుపడికే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలే కాదు.. యాక్షన్ కూడా ఉంటుందంటున్నారు.  

Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

భావితరాలకు మేలు చేయకపోయినా పర్వాలేదు.. నష్టం చేయకూడదు..!

రాజకీయ పార్టీలు కేవలం తమ కార్యకర్తలు మాత్రమే ఓటర్లు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. తాము ఏం చేసినా తమ వాళ్లు సమర్థిస్తారు అనే ధోరణికి వచ్చేశారు. ఇది ఎలా తయారైందంటే.. ఎదుటి వాడిని తిట్టని వాడు.. కొట్టని వాడు.. చేతకాని వాడు అన్న స్థాయికి వీళ్లు క్రమక్రమంగా చేరిపోయారు. కానీ వీళ్లంతా తెలుసుకోవలసింది.. ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు. మన ప్రవర్తనను గమనించే...ఓ వర్గం సైలంట్‌గా మనను చూస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్లు స్పందిస్తారు. కానీ అప్పటి వరకూ.. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రతిపక్ష పాత్రను నిర్వహించాల్సిన పార్టీలు బాధ్యతగా ఉండాలి. 

Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

Also Read : లోకేశ్‌పై హత్యాయత్నం కేసు.. మరో నలుగురిపై కూడా.. డీజీపీ సంచలన ప్రకటన

Also Read: ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget