అన్వేషించండి

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

Weather in Telugu States: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, పిడుగులు పడ్డాయి.
  • గుంటూరు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు, గోడ కూలి పిల్లవాడు మృతి చెందాడు.
  • రైతుల మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు అకాల వర్షంతో నేలపాలయ్యాయి.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.

Weather in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, ఆకాశం మేఘావృతమైన ఉపశమనం కలిగిస్తుందని అనుకునేలోపే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికించాయి. ఈ అకాల వర్షం సామాన్య ప్రజల ప్రాణాలను తీయడమే కాకుండా, చేతికి వచ్చిన పంటను అందకుండా చేసిన రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీసింది. 

గుంటూరు, నంద్యాల జిల్లాలో పెను విషాదం

ప్రకృతి వైపరిత్యం కారణంగా గుంటూరు, నంద్యాల జిల్లాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఈ సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అదే సమయంలో తుళ్లూరులోని మేరిమాత స్కూల్‌ మైదానంలో హఠాత్తుగా పిడుగు పడింది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావు అే వ్యక్తిపై పిడుగుపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మృతుడు బీఎస్‌ఆర్ కంపెనీలో సర్వేయర్ విభాగ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

మరోవైపు నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో కరిసిన భారీ వర్షానికి ఒక పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసు ఉన్న అభి అనే పసిబాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అమరావతి ప్రాంతంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

నేలపాలైన పంటలు

ఈ అకాల వడగళ్ల వాన రైతుల ఆశలను అడియాశలు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వాన మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయు పెద్ద ఎత్తున నేలరాలాయి. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ ప్రకృతి విపత్తు ర్థికంగా పెద్ద దెబ్బ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో జోరు వానలు 

తెలంగాణలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా,కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా నేలరాలింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌ మండలం పరిధిలో కురిసిన వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలో మిర్చి రైతులు తమ పంటను కాపాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అకాల వర్షం నుంచి కుప్పలుగా పోసిన మిర్చి తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

విమాన సర్వీసులకు అంతరాయం 

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో దిగలేకపోయింది. ఏలూరు జిల్లా నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడ ఒక ఇంటిపై పిడుగు పడటంతో ఆ ఇంటి టెర్రస్‌పైన ఉన్న పిట్టగోడ ధ్వంసమైంది. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిన మోస్తరు వర్షం కురిసింది. 

రాబోయే మూడు రోజులు అప్రమత్తం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

ప్రధానంగా ఈ జిల్లాల్లో ప్రభావం 

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవం, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ , గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 

 

 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది.

అకాల వర్షం వల్ల ఎవరికి నష్టం జరిగింది?

ఈ అకాల వర్షం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు తీయడంతో పాటు, రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడెక్కడ విషాదం చోటు చేసుకుంది?

గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మరణించాడు. నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో గోడ కూలి ఏడాది బాలుడు మృతి చెందాడు.

రవాణా వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంది?

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా విమానాశ్రయాల్లో విమానాలు దిగలేకపోయాయి.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

రాబోయే మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget