అన్వేషించండి

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

Weather in Telugu States: మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Weather in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, ఆకాశం మేఘావృతమైన ఉపశమనం కలిగిస్తుందని అనుకునేలోపే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వణికించాయి. ఈ అకాల వర్షం సామాన్య ప్రజల ప్రాణాలను తీయడమే కాకుండా, చేతికి వచ్చిన పంటను అందకుండా చేసిన రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీసింది. 

గుంటూరు, నంద్యాల జిల్లాలో పెను విషాదం

ప్రకృతి వైపరిత్యం కారణంగా గుంటూరు, నంద్యాల జిల్లాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఈ సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అదే సమయంలో తుళ్లూరులోని మేరిమాత స్కూల్‌ మైదానంలో హఠాత్తుగా పిడుగు పడింది. దురదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావు అే వ్యక్తిపై పిడుగుపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచారు. మృతుడు బీఎస్‌ఆర్ కంపెనీలో సర్వేయర్ విభాగ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 

మరోవైపు నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో కరిసిన భారీ వర్షానికి ఒక పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసు ఉన్న అభి అనే పసిబాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అమరావతి ప్రాంతంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

నేలపాలైన పంటలు

ఈ అకాల వడగళ్ల వాన రైతుల ఆశలను అడియాశలు చేసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విజయవాడ రూరల్ మండలం నున్న ప్రాంతంలో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వాన మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయు పెద్ద ఎత్తున నేలరాలాయి. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ ప్రకృతి విపత్తు ర్థికంగా పెద్ద దెబ్బ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో జోరు వానలు 

తెలంగాణలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా,కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా నేలరాలింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌ మండలం పరిధిలో కురిసిన వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలో మిర్చి రైతులు తమ పంటను కాపాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అకాల వర్షం నుంచి కుప్పలుగా పోసిన మిర్చి తడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

విమాన సర్వీసులకు అంతరాయం 

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇండిగో విమానం భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో దిగలేకపోయింది. ఏలూరు జిల్లా నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడ ఒక ఇంటిపై పిడుగు పడటంతో ఆ ఇంటి టెర్రస్‌పైన ఉన్న పిట్టగోడ ధ్వంసమైంది. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిన మోస్తరు వర్షం కురిసింది. 

రాబోయే మూడు రోజులు అప్రమత్తం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని ఆయన వెల్లడించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 

ప్రధానంగా ఈ జిల్లాల్లో ప్రభావం 

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవం, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ , గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 

 

 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంది?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది.

అకాల వర్షం వల్ల ఎవరికి నష్టం జరిగింది?

ఈ అకాల వర్షం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు తీయడంతో పాటు, రైతన్నలకు తీవ్ర నష్టం కలిగించింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ముఖ్యంగా మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.

ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడెక్కడ విషాదం చోటు చేసుకుంది?

గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మరణించాడు. నంద్యాల జిల్లా ప్రాతకోట గ్రామంలో గోడ కూలి ఏడాది బాలుడు మృతి చెందాడు.

రవాణా వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంది?

వాతావరణ మార్పుల ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా పడింది. భారీ ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా విమానాశ్రయాల్లో విమానాలు దిగలేకపోయాయి.

రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?

రాబోయే మూడు రోజుల పాటు విభిన్నమైన వాతావరణం ఉండబోతోందని అధికారులు హెచ్చరించారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Advertisement

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress PCC chief controversy: జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి - తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం - మంత్రి క్లారిటీ
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Sreeleela : ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Top Petrol Scooters in India : ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
ఎలక్ట్రిక్ యుగంలో పెట్రోల్‌ స్కూటర్లకు తగ్గని క్రేజ్‌- ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ ఎన్ని? మీకు ఏ వాహనం సరిపోతుందో చూద్దాం!
Embed widget