అన్వేషించండి

Nara Lokesh: లోకేశ్‌పై హత్యాయత్నం కేసు.. మరో నలుగురిపై కూడా.. డీజీపీ సంచలన ప్రకటన

టీడీపీ ఆఫీసుకు వచ్చిన సీఐపై దాడి చేశారని డీజీపీ తెలిపారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఏపీలో కొనసాగుతున్న బంద్, ఉద్రిక్త పరిణామాలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా సంచలన ప్రకటన చేశారు. మంగళవారం టీడీపీ ఆఫీసుపై దుండగుల దాడి అనంతరం అక్కడికి సీఐ నాయక్‌ రాగా.. ఆయనపై నారా లోకేశ్ సహా పలువురు దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లుగా డీజీపీ ప్రకటించారు. ఈ కేసులో ఏ1గా లోకేశ్ పేరు, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్‌, ఏ5గా పోతినేని శ్రీనివాసరావుపై కేసు పెట్టినట్లు చెప్పారు. హత్యాయత్నంతో పాటు వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్లు వెల్లడించారు. 

Also Read: నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?

చంద్రబాబు ఫోన్ ఎత్తా.. వినపడట్లేదని కట్ చేశా
అంతేకాకుండా టీడీపీ నాయకుడు పట్టాభిరాం అసభ్య వ్యాఖ్యలు చేశారని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొట్టిపారేశారు. చంద్రబాబు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తలేదన్న విమర్శలపై కూడా గౌతం సవాంగ్ స్పందించారు. ఆయన తెలియని నెంబరు నుంచి ఫోన్ చేశారని, ఆ సమయంలో పరేడ్‌లో ఉన్నానని అన్నారు. కాల్ ఎత్తినా బ్యాంక్ గ్రౌండ్‌కు వినిపించలేదని చెప్పారు. తర్వాత మాట్లాడతానని తాను ఫోన్ కట్ చేసినట్లుగా సమర్థించుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ కరోనా సమయంలో పోలీసులు చేసిన సేవలను కొనియాడారు. కొవిడ్ సమయంలో సమాజ సేవ చేసిన పోలీసులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సవాలు ఉన్న సమయంలో కూడా ఎంతో మంది పోలీసులు, మహిళా పోలీసులు తమ ఉద్యోగాన్ని, బాధ్యతను నిబద్ధతతోనే నిర్వర్తించారని అన్నారు. 206 మంది పోలీసులు కరోనా సోకవడం వల్ల చనిపోయారని అన్నారు.

Also Read:  ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

ప్రెస్ మీట్‌లో సీఐ నాయక్
అయితే, టీడీపీ నాయకులు దాడి చేశారని భావిస్తున్న సీఐ నాయక్.. మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కనిపించారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు అయినట్లు కనిపించలేదు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.


Nara Lokesh: లోకేశ్‌పై హత్యాయత్నం కేసు.. మరో నలుగురిపై కూడా.. డీజీపీ సంచలన ప్రకటన


Nara Lokesh: లోకేశ్‌పై హత్యాయత్నం కేసు.. మరో నలుగురిపై కూడా.. డీజీపీ సంచలన ప్రకటన

Also Read: Jagan Reaction : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్

Also Read: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్

Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget