By: ABP Desam | Updated at : 19 Oct 2021 10:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పవన్ కల్యాణ్(ఫైల్ ఫొటో)
ఏపీలో రాజకీయాలు రచ్చకెక్కాయి. టీడీపీ కార్యాలయాలపై మెరుపుదాడులు జరిగాయి. టీడీపీ నేత పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఇలాంటి దాడులు రాష్ట్రానికి మంచిది కాదని పవన్ అన్నారు. ఏపీ అరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. ఇలాంటి దాడులను పోలీసులు వెంటనే నియంత్రించాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ హిస్టరీలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిది కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు అరాచకాలకు దారి తీస్తాయన్నారు. ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న పవన్... దాడులకు పాల్పడినవారిని వెంటనే శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కోరారు.
పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/K9YtQ4hTt9
— JanaSena Party (@JanaSenaParty) October 19, 2021
ఇది దుష్ట సంప్రదాయం : సీపీఐ రామకృష్ణ
టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రతిపక్ష పార్టీపై దాడులకు పాల్పడడం దుష్ట సంప్రదాయమన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను విఘాతం కలిగిస్తాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దాడిని ఖండించిన బీజేపీ
టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను బీజేపీ పార్టీ ఖండించింది. టిడిపి కార్యాలయం, నేతల ఇళ్ల పై దాడులను ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు మంచిది కాదన్నారు. నిందితులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలన్నారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Horoscope 28th June 2022: ఈ రోజు ఈ రాశివారికి సంపన్నమైన రోజు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!