అన్వేషించండి

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు

Andhra Pradesh News | తనపై జరిగిన కస్టడీయల్ హింసకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్య రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.

Raghu Rama Krishna Raju | అమరావతి: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబుకు సీనియర్ నేత రఘురామ కంప్లైంట్ చేశారు. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం  ఏర్పడిన వెంటనే, వైసీపీ ప్రభుత్వంలో జగన్ హయాంలో తనపై జరిగిన కస్టడీయల్ హింసపై చర్య తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఐపీఎస్‌లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సిఐడి అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి (గుంటూరు జీజీహెచ్)లపై రఘురామ ఫిర్యాదు చేయగా FIR నమోదు చేశారని తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ అధికారి విజయ పాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించారు. మరోవైపు పీవీ సునీల్ కుమార్ దర్యాప్తులో జోక్యం  చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడు తున్నారని రఘురామ పేర్కొన్నారు. కనుక ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదుపై స్పందించి తక్షణమే న్యాయం చేయాలని రఘురామ అభ్యర్థించారు.

మూడుసార్లు తనను లేపేయాలని చూశారన్న రఘురామ
‘గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. మాజీ సీఎం జగన్ కు మచ్చుకైనా మానవత్వం అంటూ లేదు. నన్ను దారుణంగా చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగకుండా మూడుసార్లు నన్ను పైకి పంపాలని చూశారు. అలాంటి జగన్ కు అప్పుడే మానవత్వం విలువ తెలిసొచ్చిందా. ఇంతకీ ఏం జరిగిందా. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నా, పటిష్టమైన భద్రత ఉన్నా ఎవరైనా తనను కాల్చివేస్తారేమోనని చెట్లు నరికించిన ఘనుడు జగన్. నాలుగన్నరేళ్లు నా నియోజకవర్గానికి సైతం రాకుండా నన్ను అడ్డుకున్నారు. ప్రధాని మోదీ వస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని చూస్తే ఆ ప్రయత్నం కూడా సఫలం కాకుండా చేశారు. 

Also Read: Tirumala Bramhosthavam: తిరుమలను ఆది వరాహక్షేత్రం అని ఎందుకు అంటారు.. అలా చేస్తేనే శ్రీవారి దర్శనంతో సత్ఫలితం!

జగన్ నువ్వు ఎమ్మెల్యేవు. నువ్వు తిరుమల దర్శనానికి వెళ్తే నీతో పాటు మరికొందర్ని అనుమతిస్తారు. కానీ వందలు, వేల మందితో కలిసి వెళ్లాలని ప్లాన్ చేయడం ఏంటి? గతంలో తీసివేసిన రూల్ ను టీటీడీ ఈవో శ్యామలరావు తిరిగి పునరుద్ధరించారు. ఇలా ప్రభుత్వాలు సైతం ఎన్నో పాత నిర్ణయాలను అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు రూల్ పాటించకుండా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. నెయ్యి కల్తీపై ఎన్‌డీడీబీ టెస్టులు జరిపి నిజమేనని తేల్చింది. దీనిపై సైతం వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. వేల ఆవుల పాలలో కల్తీ జరుగుతుందా? ఏఆర్ డెయిరీ పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్వామివారికి ఏ అపచారం జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లడ్డూ కల్తీ వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ త్వరలోనే నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించనుందని’ రఘురామ ఇటీవల కీలక విషయాలు ప్రస్తావించారు.

Also Read: LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget