By: ABP Desam | Updated at : 23 Jun 2022 09:38 AM (IST)
ఆత్మకూరులో పోలింగ్ స్టేషన్ వద్ద పరీక్షలు చేస్తున్న సిబ్బంది
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారు. పోలింగ్ కోసం వస్తున్న ఓటర్లకు శానిటైజర్, మాస్క్ లు అందిస్తున్నారు. ఆశా వర్కర్లు ప్రాథమిక చికిత్స కిట్ లు అక్కడే ఉంచుకుని విధులు నిర్వహిస్తున్నారు.
పోలింగ్ శాతంపై అనుమానం..
ఓవైపు పోలింగ్ మొదలైనా.. ఓటర్ల బారులు కనిపించడంలేదు. ఒక్కొక్కరే నిదానంగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. మరోవైపు కూలి పనులకోసం వెళ్లే మహిళళు..ఉదయాన్నే ఆత్మకూరులోని పలు కూడళ్లలో కనిపించారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడంలేదు. పొలం పనులకోసం మహిళలు వెళ్తున్నారు.
రాత్రి వర్షానికి పోలింగ్ స్టేషన్లు బురదమయం కావడంతో.. తెల్లవారగానే అధికారులు హడావిడి పడుతూ పనులు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్లకు ఇసుక తరలించారు. బురద లేకుండా చూస్తున్నారు. రాత్రి అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు చాలా చోట్ల షామియానాలు తడిసిపోయాయి.
ఆత్మకూరు ప్రశాంతంగానే కనిపిస్తున్నా.. పోలింగ్ కేంద్రాల్లో 44 శాతం సమస్యాత్మకమైనవేనని అధికారులు నిర్థారించారు. మొత్తం 6 మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 123 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో గొడవలు జరిగే అవకాశం లేదని అనుకున్నా.. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు ముందు జాగ్రత్త తీసుకున్నారు. 123 కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.
పోలింగ్ శాతంపై సందేహం..
విజయంపై ఇప్పటికే ధీమాగా ఉన్న అధికార వైసీపీ.. లక్ష మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. పోలింగ్ శాతం వీలైనంత మేర పెంచేందుకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఆ స్థాయిలో పోలింగ్ కి జనం ఆశక్తి చూపిస్తారా లేదా అనేది సందేహమే. ఇప్పటికే పల్లెల్లో చాలామంది నర్రవాడలో జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్లారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నవారు కూడా గత ఎన్నికలకోసం తరలి వచ్చినట్టు ఈసారి రావడంలేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందనే అంచనాలున్నాయి.
వాతావరణంలో మార్పు..
నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోతున్నా.. రాత్రి నుంచి వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఈరోజు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. భారీ వర్షం పడితే ఓటింగ్ శాంత తగ్గడానికి అది కూడా ఓ కారణం అయ్యే అవకాశముంది.
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Top Headlines Today: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
/body>