అన్వేషించండి

చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ ఫిర్యాదు- డీజీపీకి ఫోన్!

నంద్యాల టీడీపీలో వార్ మరింత ముదిరింది. ఓవైపు లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు.

లోకేష్ యువగళం నంద్యాల లోకి వస్తున్న టైంలో టీడీపీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. తన చున్నీ లాగినందుకు సుబ్బారెడ్డిపై దాడి జరిగిందని అంటున్నారు మాజీ మంత్రి అఖిల ప్రియ. ఆగ్రహంతో తన అనుచరులు ఆయనపై చేయి చేసుకున్నారని అంటున్నారామె. 

నంద్యాల టీడీపీలో వార్ మరింత ముదిరింది. ఓవైపు లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో అఖిల ప్రియను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు దానికి రియాక్షన్‌గా సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అఖిల ప్రియ. 

సుబ్బారెడ్డి తన చున్నీ లాగారని తీవ్ర ఆరోపణలు చేశారు అఖిలప్రియ. అందుకే అక్కడ గొడవ జరిగిందని... కొందరు అనుచరులు ఆయనపై చెయ్యి చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు డీజీపీతో మాట్లాడిన ఆమె... సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. 

నంద్యాల జిల్లాలో ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వర్గ పోరు నడుస్తోంది. లోకేష్ పాదయాత్ర నంద్యాలలోకి ప్రవేశించే క్రమంలో ఇరు వర్గాల మధ్య  మరోసారి వార్‌ షురూ అయింది. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. లోకేష్ పాదయాత్ర సాగుతున్న టైంలో ఈ గ్రూప్‌ వార్ టీడీపీకి తలనొప్పిగా మారుతుంది. 

ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుుడు తారాస్థాయి చేరుకున్నాయి. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న టైంలోనే ఈ రెండు వర్గాలు కొట్టుకున్నాయి. 

భూమా అఖిల ప్రియ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఏవీ సుబ్బారెడ్డిపై తిరగబడ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలు అయ్యాయి. లోకేష్‌ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే ఇలా జరగడం టిడీపీ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. 

నారా లోకేష్ యువగళం యాత్రను నంద్యాల నియోజవర్గంలోకి స్వాగతం పలికే క్రమంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమం ఇలా ఉద్రిక్తతల మధ్య సాగింది. ఓవైపు అఖిల ప్రియ వర్గీయులు, మరోవైపు సుబ్బారెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆయన్ని కొడుతున్న టైంలో పోలీసులు, ఆయన అనుచరులు ఆ దాడిని అడ్డుకున్నారు. స్వల్ప గాయాలతో సుబ్బారెడ్డి బయపడ్డారు. 

ఈ ఘర్షణ జరిగే సమయంలో అఖిల ప్రియ కూడా అక్కడే ఉన్నారు. సుబ్బారెడ్డిపై దాడి చేస్తున్న వ్యక్తిని మరో వ్యక్తి అడ్డుకుంటే ఆయన్ని కూడా చితక్కొట్టారు. ఇంతలో పోలీసులు వచ్చి సుబ్బారెడ్డిని పక్కకు తీసుకెళ్లడం విజువల్స్‌లో క్లియర్‌గా ఉంది. ఇరు వర్గాలను కూడా సర్దిచెబుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. 

తనపై జరిగిన దాడి కారణం అఖిల ప్రియ అంటున్నారు సుబ్బారెడ్డి. సత్తా ఉంటే డైరెక్ట్‌గా వచ్చి పోరాటం చేయాలని సవాల్ చేశారు. ఇరు వర్గాల ఘర్షణతో పాదయాత్రలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలగజేసుకొని సుబ్బారెడ్డిని అక్కడి నుంచి పంపేశారు. ఈ దాడితో అలర్ట్ అయిన పోలీసులు నంద్యాలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. 

సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ ఉదయం భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు. ఆమెతోపాటు భర్త భార్గవ్‌రామ్‌, పీఏ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు దాడికి కారణాలపై ఆరా తీస్తున్నారు. దాడిలో వారి పాత్రపై ప్రశ్నిస్తున్నారు. అయితే తన చున్నీ లాగారని సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ ఎదురు కేసు పెట్టడం ఈ వివాదం మరో స్థాయికి వెళ్లింది. 

Also Read:తిరుపతి‌ జిల్లాలో కామ‌ తాంత్రికుడు, సమస్యలు పోవాలంటే నగ్నంగా పూజలు చేయాలని బలవంతం!

Also Read:   ఎండలతో ఉడికిపోతున్న ఆంధ్ర, నేడు ఈ ప్రాంతాల్లో నిప్పుల కొలిమే - తెలంగాణలో ఇలా

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Embed widget