అన్వేషించండి

Jagan Nellore Tour: చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుంది - నెల్లూరులో జగన్ హెచ్చరిక

Jagan Statement in Nellore: వైసీపీ నేతలపై అదే పనిగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుందన్నారు.

Jagan accuses YCP leaders of being attacked: జగన్ నెల్లూరు పర్యటన ప్రధాన ఉద్దేశం, రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడం మరియు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలపడం. ఈ ఇద్దరు నాయకులపై కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలు చేపట్టిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై ఇటీవల టీడీపీ మద్దతుదారులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కాలేజ్ డేస్ లో జరిగిన ఘటనను మనసులో పెట్టుకొని పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని జైలు పాలు చేశాడు చంద్రబాబు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు మా మహిళా నేతలు రోజా , విడదల రజిని , హారికపై చెప్పడానికి కూడా వీలు లేని రీతిలో  అత్యంత హేయంగా మాట్లాడారు. చంద్రబాబు వారిపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాటిన విత్తనమే పండుతుందని హెచ్చరించారు. 

కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని జగన్ ఆరోపించారు.  "సూపర్ సిక్స్" పథకం కింద ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం మాత్రమే అని, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "పీ4"  కాన్సెప్ట్‌ను పరిచయం చేసి, పరిపాలనను "బలవంతపు దానధర్మాల"గా మార్చారని, ఇది ప్రజలకు న్యాయం చేయడం కాదని విమర్శించారు  విద్యా, వసతి గృహాల పరిస్థితి దిగజారిందని, నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారన్నారు.                                  
  
 జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో అధిక భద్రతా ఏర్పాట్లు, రోడ్లు తవ్వడం, ముళ్ల కంచెలు, బారికేడ్లు, చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆంక్షలు ప్రజలను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తనను కలవకుండా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రలని ఆరోపించారు.  3,000 మంది పోలీసులను మోహరించడం, జైలు వద్ద 10 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించకపోవడం, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మందికి మించి గుమిగూడకుండా చట్టపరమైన హెచ్చరికలు జారీ చేయడం వంటివి "అఘోషిత ఎమర్జెన్సీ"ని తలపించాయన్నారు.                          
 
నెల్లూరు సెంట్రల్ జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు కాకాని కుమార్తె పూజిత, ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు. అక్కడి నుంచి  నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి  వెళ్లారు.  నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఎ.ఆర్. దామోదర్   పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు వద్ద కేవలం ముగ్గురు వ్యక్తులను మాత్రమే అనుమతించారు.               

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget