అన్వేషించండి

CM Chandrababu: 'మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం' - తప్పు చేసిన వారిని వదిలిపెట్టనన్న సీఎం చంద్రబాబు

Andhra News: గత ఐదేళ్లలో పరదాలు కనిపించాయని.. నేడు అలాంటివి కనిపించవని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు.

CM Chandrababu Comments in Srikakulam: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని.. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో దీపం 2.0లో భాగంగా ఆయన శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీ లేని పోరాటం చేశారని.. వైసీపీ నేతలు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. 'నేను బాధ్యత గల ప్రజాప్రతినిధిని. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను. రాజకీయ కక్షసాధింపులకు పోను. నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి. గత ఐదేళ్లలో సీఎం వస్తే పరదాలు కనిపించేవి. నేడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ హయాంలో సభలకు ప్రజలను బలవంతంగా తరలించారు. చెడుపై మంచి గెలిచిందనే దీపావళి చేసుకుంటున్నాం. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. కట్టెల పొయ్యితో మహిళలు పడిన బాధలు తెలుసు. దీపం పథకం కింద సిలిండర్ ఇచ్చి మహిళల కష్టాలు తీర్చాను.' అని సీఎం పేర్కొన్నారు.

టీ చేసిన చంద్రబాబు

కాగా, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా ఓ మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేశారు. ఈ క్రమంలో టీ తయారీకి అవసరమైన వస్తువులు అందివ్వడంలో అక్కడి వారు కాస్త కంగారుపడుతుంటే కూల్‌గా ఉండాలని తాను వచ్చాననే టెన్షన్ వద్దంటూ చెప్పుకొచ్చారు. టీ చేస్తూనే శాంతమ్మతో మాట్లాడిన సీఎం ఆమె కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీ మరిగిన తర్వాత ఆయనే వడపోసి అందరికీ  ఇచ్చారు. ఈ టీ బిల్లు చెల్లించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో చమత్కరించారు. ఆయనకు కూడా అదే స్పీడ్‌తో... ఏ నిధుల నుంచి చెల్లించాలంటూ రిప్లై ఇచ్చారు. నీ ఇష్టమని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నా అభ్యంతరం లేదన్నారు. 

మహిళకు సొంతింటి హామీ

అనంతరం సీఎం జానకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఒంటరి పింఛను అందజేశారు. స్వయంగా సీఎం తన ఇంటికి రావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు సొంతిల్లు కావాలని ఆమె చంద్రబాబును కోరారు. ఇల్లు కట్టిస్తానని.. శుక్రవారం నుంచే ఇంటి పని ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Also Read: Andhra Pradesh: పులివెందుల ఎమ్మెల్యేను ఫేక్ జగన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? టీడీపీ పోస్ట్ వైరల్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget