అన్వేషించండి

Night Curfew in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ మరోసారి పొడిగింపు... కొత్తగా 1435 కరోనా కేసులు నమోదు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి.

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. అయితే కర్ఫ్యూ సమయాన్ని మరో గంట సడలింపు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకూ సడలింపు సమయాన్ని పెంచినట్టు తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీచేశారు. 

Also Read: Vijayawada Murder Case: రాహుల్ మర్డర్ కేసులో ఆ నలుగురు.. ఓ రౌడీషీటర్ పాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు.. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమా!

రాత్రి కర్ఫ్యూలో మార్పులు

ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాప్తి, కర్ఫ్యూపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సీఎం జగన్ ఆదేశాలు మేరకు రాత్రి కర్ఫ్యూ పెంచినట్లు అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ సమయంలో మార్పులు చేసినట్టు వెల్లడించారు.

Also Read: AP BJP : జగన్‌తో కిషన్‌ భేటీపై ఏపీ బీజేపీ నేతల్లో కలవరం ఎందుకు..?

థర్డ్ వేవ్ నేపథ్యంలో

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంతో ఏపీ సర్కార్ తగిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మళ్లీ రాత్రి కర్ఫ్యూ పొడిగించింది. అలాగే కరోనా నిబంధనలపై అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రోడ్లపైకి వచ్చే జనాలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. 

Also Read: Covid-19 Vaccine for Kids: త్వరలోనే పిల్లలకు 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 1695 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 15472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 69,173  కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. 

Also Read:  COVID-19 Updates: తగ్గని కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో తాజాగా 36,571 మందికి కరోనా పాజిటివ్.. పెరుగుతున్న మరణాలు

Also Read: Vizianagaram News: విజయనగరంలో దారుణం... పెళ్లిచేసుకోబోయే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు... యువతి పరిస్థితి విషమం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
iphone 17e Price: పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
పాత ఐఫోన్ ధరకే ఆపిల్ ఐఫోన్ 17e తో సంచలనం! సరికొత్త ప్రో మోడల్ ఫీచర్లు ఇవే
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
వన్డేల్లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉందో చూశారా.. కలిసొచ్చిన మూడో స్థానం
Embed widget