అన్వేషించండి

Covid-19 Vaccine for Kids: త్వరలోనే పిల్లలకు 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ వ్యాక్సిన్

దేశంలో 12-17 ఏళ్ల పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సీడీఎస్ సీఓకు దరఖాస్తు చేసుకుంది. త్వరలోనే పిల్లలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

కొవిడ్ 19 సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై భారత్ లో అధ్యయనం చేసేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధమైంది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు దరఖాస్తు చేసుకుంది. 12-17 మధ్య వయసువారిపై ఈ పరిశోదన చేయనుంది.

దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఈ నెెల మొదట్లో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ శుఖ్ మాండవీయ తెలిపారు. 

" కరోనాపై పోరాటంలో భారత్ కు మరో ఆయుధం దొరికింది. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కొవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఇప్పుడు మనకు అందుబాటులో 5 వ్యాక్సిన్ లు ఉన్నాయి. కరోనాపై మన పోరాటానికి మరింత శక్తి వచ్చింది.                 "
-మన్ శుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

అమెరికా సహా ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోన్న డెల్టా వేరియంట్ పై తమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని టీకా తయారీ సంస్థ తెలిపింది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే లో అనుమతి ఇచ్చింది. దీనితో పాటు 12-18 ఏళ్ల వయసువారిపై జైడస్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది.

భారత్ లో వ్యాక్సినేషన్..

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ కొత్త మైలురాయిని అందుకుంది. 50 కోట్ల (57,16,71,264)కు పైగా వ్యాక్సిన్ డోసులను ఇప్పటివరకు అందించింది. గత 24 గంటల్లో 48 లక్షలకు పైగా డోసులను (48,84,440) ప్రజలకు అందించింది.

పెరిగిన కేసులు..

దేశంలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాలు స్వల్పంగా పెరిగాయి. యాక్టివ్ కేసులు 150 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. తాజాగా 18,86,271 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 36,571 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  అదే సమయంలో మరో 540 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. థర్డ్ వేవ్ మరింత భయంకరంగా ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. 

Also Read:

COVID-19 Updates: తగ్గని కరోనా సెకండ్ వేవ్.. భారత్‌లో తాజాగా 36,571 మందికి కరోనా పాజిటివ్.. పెరుగుతున్న మరణాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget