అన్వేషించండి

Top Headlines: ఏపీలో నిరుద్యోగులకు బిగ్ షాక్ - తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Top Headlines In Ap And Telangana:

1. ఏపీలో నిరుద్యోగులకు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. టెట్ ఫలితాలు వెలువడగానే మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. ఏపీలో నవంబరు 4న టెట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేస్తారని అభ్యర్థులు ఆశించారు. కానీ తాజాగా మెగా డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి విద్యాశాఖ ఉసూరుమనిపించింది. ఇంకా చదవండి.

2. అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ సినీ నటుడు అల్లు అర్జున్‌పై నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటించారు. ఆ టైంలో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆ కేసును కొట్టి వేయాలంటూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో గత నెలలో పిటిషన్ వేశారు. తాను ఎన్నికల ప్రచారం కోసం వెళ్లలేదని స్నేహితుణ్ని కలవడానికి మాత్రమే వెళ్లానంటూ కోర్టుకు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణ జరిపి కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఇంకా చదవండి.

3. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్

"వన్‌ స్టేట్‌-వన్‌ ఆర్‌ఆర్‌బీ" కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (Regional Rural Banks/ RRBs) ఏకీకరణలో 4వ దశను ప్రారంభించింది. RRBల పనితీరును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం ఈ విలీన ప్రక్రియ లక్ష్యం. ఫలితంగా, దేశంలో ప్రస్తుతమున్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గుతుంది. నాబార్డ్‌ (NABARD)తో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదింపుల తర్వాత, కేంద్ర ప్రభుత్వం RRBల విలీన నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి.

4. తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే

తెలంగాణలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సర్వేను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో ఉన్న సభ్యుల వివరాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ఉద్యోగ, రాజకీయ నేపథ్యంపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల వివరాలు తెలుసుకునేలా ఈ సర్వే ప్రశ్నావళిని రూపొందించారు. ఇంకా చదవండి.

5. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌ భారీ విజయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే ఆయన 300కుపైగా ఎలక్టోర్స్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఫైనల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ఆధిక్యం చూస్తే ట్రంప్‌ గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి 277 ఎలక్టోర్స్‌లో విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తారు అనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి  కమలా హారిస్ కేవలం 226 ఎలక్టోర్స్ వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget