అన్వేషించండి

లిల్లీపువ్వుల మొక్కలు అందంగా పెరగాలంటే మాత్రం ఈ సూచనలు పాటించండి

లిల్లీపూలు(రజనీగంధ) చూడడానికి ఎంత బావుంటాయో. వాటి సువాసన కూడా చాలా బావుంటుంది. ఇలాంటి మంచి పరిమళం వెదజల్లే మొక్కలను ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారా.. ఇవిగో టిప్స్.

లిల్లీపువ్వు(రజనీగంధ) తన తెలుపు రంగుతో, సువాసనతో ఇట్టే ఆకర్షిస్తుంది. రజనీగంధ అంటే రాత్రిపూట సువాసనలు వచ్చేది అని అర్ధం. పేరుకు తగ్గట్లే ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఇది మెక్సికోలో పుట్టిందని.. పోర్చుగీసు వారు ఈ పువ్వును భారతదేశానికి తీసుకువచ్చారని పరిశోధకుల మాట.

ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. నేలపై కానీ, కుండీల్లో కానీ కాస్త సూర్యరశ్మి సహాయంతో దీన్ని పెంచుకోవచ్చు. బెంగళూరుకు చెందిన సేంద్రీయ తోటల పెంపక నిపుణుడు శ్రీరామ్ అరవముదన్ దీన్ని ఇంట్లో పెంచుకునేందుకు సులభమైన మార్గాలను సూచిస్తున్నారు. 

1. దుంపలు సేకరించడం
 నర్సరీ లేదా లిల్లీ పువ్వులు పెంచుతున్న వ్యక్తి నుంచి వాటి దుంపలను సేకరించాలి. ఇవి తేలిగ్గానే లభ్యమవుతాయి. 

2. ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం
అవి సూర్యరశ్మిని ఇష్టపడే మొక్కలు. కాబట్టి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలపాటు సూర్యకాంతి ప్రత్యక్షంగా పడేలా చూసుకోవాలి. దానికోసం తగిన స్థలాన్ని ఎంచుకోవాలి. 

3. సరైన మట్టి, కుండ అవసరం
దుంపలను నేలలో, కుండీలో నాటేటప్పుడు, మట్టి లేదా పాత్ర బాగా ఎండిపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో దుంపలు కుళ్లిపోతాయి. 8 అంగుళాల కంటే పెద్ద కుండ అవసరం. 

4. సరైన పోటింగ్ మిక్స్
ఎర్రమట్టి, కంపోస్ట్ మరియు కోకో పీట్ లను 2:1:1 నిష్పత్తిలో కలపడం ద్వారా కుండ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమం సాధారణంగా దాదాపు అన్ని తోట మొక్కలకు, ముఖ్యంగా పూలు పూసే మొక్కలకు బాగా పనిచేస్తుంది. ఆవుపేడతో కంపోస్టు ఎరువును తయారుచేసుకుని ఆ మొక్కలకు వాడాలి. 

5. సరిగ్గా నాటాలి
రజనిగంధ నాటేటప్పుడు, దుంపకు, దుంపకు మధ్య స్థలం ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల ప్రతి దుంపకు కావలసినంత పోషణ లభించి, బాగా మొలుస్తాయి. 

6. ఎక్కువ నీరు వద్దు
దుంపలను నాటిన తర్వాత మట్టికి నీరు బాగా పోయాలి. మొక్క మొలకెత్తడానికి అవసరమైన తేమ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దుంప మొలకెత్తిన తర్వాత మట్టి పొడిగా ఉన్నప్పుడు నీరు పోయాలి. వర్షం పడుతుంటే నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దుంపలు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందుకే ఎక్కవ నీరు అవసరం ఉండదు. 

7. చీడపీడల నుంచి సంరక్షణ
నత్తలు ఇంకా ఏవైనా చీడపీడలు దాడి చేస్తే.. వాటిని తొలగించాలి. రసాయన మందులు వాడకూడదు.

లిల్లీ మొక్కలను నాటడానికి మార్చి- సెప్టెంబర్ నెలల మధ్య సమయం అనువైనది. ఎండ తగినంతగా ఉండదు కనుక శీతాకాలంలో వీటిని నాటకూడదు. మొక్క నుంచి పువ్వు రావడానికి 90 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఒకసారి పూయడం మొదలైన తర్వాత 3, 4 నెలలపాటు పూలు పూస్తూనే ఉంటాయి. 

పూలు పూయడం పూర్తయిన తర్వాత ఆకులు, రెమ్మలు ఎండిపోతాయి. అయితే దుంప మాత్రం సజీవంగానే ఉంటుంది. వీటిని కోసి శుభ్రం చేసి నిల్వ చేసి తర్వాతి సీజన్ కోసం ఉపయోగించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget