అన్వేషించండి

లిల్లీపువ్వుల మొక్కలు అందంగా పెరగాలంటే మాత్రం ఈ సూచనలు పాటించండి

లిల్లీపూలు(రజనీగంధ) చూడడానికి ఎంత బావుంటాయో. వాటి సువాసన కూడా చాలా బావుంటుంది. ఇలాంటి మంచి పరిమళం వెదజల్లే మొక్కలను ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారా.. ఇవిగో టిప్స్.

లిల్లీపువ్వు(రజనీగంధ) తన తెలుపు రంగుతో, సువాసనతో ఇట్టే ఆకర్షిస్తుంది. రజనీగంధ అంటే రాత్రిపూట సువాసనలు వచ్చేది అని అర్ధం. పేరుకు తగ్గట్లే ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. ఇది మెక్సికోలో పుట్టిందని.. పోర్చుగీసు వారు ఈ పువ్వును భారతదేశానికి తీసుకువచ్చారని పరిశోధకుల మాట.

ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. నేలపై కానీ, కుండీల్లో కానీ కాస్త సూర్యరశ్మి సహాయంతో దీన్ని పెంచుకోవచ్చు. బెంగళూరుకు చెందిన సేంద్రీయ తోటల పెంపక నిపుణుడు శ్రీరామ్ అరవముదన్ దీన్ని ఇంట్లో పెంచుకునేందుకు సులభమైన మార్గాలను సూచిస్తున్నారు. 

1. దుంపలు సేకరించడం
 నర్సరీ లేదా లిల్లీ పువ్వులు పెంచుతున్న వ్యక్తి నుంచి వాటి దుంపలను సేకరించాలి. ఇవి తేలిగ్గానే లభ్యమవుతాయి. 

2. ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం
అవి సూర్యరశ్మిని ఇష్టపడే మొక్కలు. కాబట్టి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలపాటు సూర్యకాంతి ప్రత్యక్షంగా పడేలా చూసుకోవాలి. దానికోసం తగిన స్థలాన్ని ఎంచుకోవాలి. 

3. సరైన మట్టి, కుండ అవసరం
దుంపలను నేలలో, కుండీలో నాటేటప్పుడు, మట్టి లేదా పాత్ర బాగా ఎండిపోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే నీరు నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో దుంపలు కుళ్లిపోతాయి. 8 అంగుళాల కంటే పెద్ద కుండ అవసరం. 

4. సరైన పోటింగ్ మిక్స్
ఎర్రమట్టి, కంపోస్ట్ మరియు కోకో పీట్ లను 2:1:1 నిష్పత్తిలో కలపడం ద్వారా కుండ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమం సాధారణంగా దాదాపు అన్ని తోట మొక్కలకు, ముఖ్యంగా పూలు పూసే మొక్కలకు బాగా పనిచేస్తుంది. ఆవుపేడతో కంపోస్టు ఎరువును తయారుచేసుకుని ఆ మొక్కలకు వాడాలి. 

5. సరిగ్గా నాటాలి
రజనిగంధ నాటేటప్పుడు, దుంపకు, దుంపకు మధ్య స్థలం ఉండేలా చూసుకోవాలి. దాని వల్ల ప్రతి దుంపకు కావలసినంత పోషణ లభించి, బాగా మొలుస్తాయి. 

6. ఎక్కువ నీరు వద్దు
దుంపలను నాటిన తర్వాత మట్టికి నీరు బాగా పోయాలి. మొక్క మొలకెత్తడానికి అవసరమైన తేమ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. దుంప మొలకెత్తిన తర్వాత మట్టి పొడిగా ఉన్నప్పుడు నీరు పోయాలి. వర్షం పడుతుంటే నీరు పోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దుంపలు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందుకే ఎక్కవ నీరు అవసరం ఉండదు. 

7. చీడపీడల నుంచి సంరక్షణ
నత్తలు ఇంకా ఏవైనా చీడపీడలు దాడి చేస్తే.. వాటిని తొలగించాలి. రసాయన మందులు వాడకూడదు.

లిల్లీ మొక్కలను నాటడానికి మార్చి- సెప్టెంబర్ నెలల మధ్య సమయం అనువైనది. ఎండ తగినంతగా ఉండదు కనుక శీతాకాలంలో వీటిని నాటకూడదు. మొక్క నుంచి పువ్వు రావడానికి 90 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. ఒకసారి పూయడం మొదలైన తర్వాత 3, 4 నెలలపాటు పూలు పూస్తూనే ఉంటాయి. 

పూలు పూయడం పూర్తయిన తర్వాత ఆకులు, రెమ్మలు ఎండిపోతాయి. అయితే దుంప మాత్రం సజీవంగానే ఉంటుంది. వీటిని కోసి శుభ్రం చేసి నిల్వ చేసి తర్వాతి సీజన్ కోసం ఉపయోగించవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget