అన్వేషించండి

Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!

Andhra Pradesh and Telangana Weather Update: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మూడు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.

Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలకు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎప్పుడో వేసవి కాలంలో రావాల్సిన వర్షాలు వేసవి మొదట్లోనే పడుతున్నాయని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు. 

తెలంగాణలో మూడు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ పరిస్థితిని ముందే గ్రహించిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు. శుక్రవారం నుంచి వాతావరణం నార్మల్‌గా ఉంటుందని ఉక్కపోత మొదలవుతుందని వెల్లడించారు. 

నాలుగు జిల్లాలకు వర్షాల హెచ్చరిక ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత మాత్రం తగ్గదని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదు అవుతున్నాయని తెలిపారు. బుధవారం కూడా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి. 

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం లేదా రాత్రివేళల్లో పొగమంచు పరిస్థితులు ఏర్పడతాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది. ఉపరితల గాలులు దక్షిణ ఆగ్నేయ దిశలో గంటలు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలుగా నమోదు అయితే కనిష్ట ఉష్ణోగ్రత 20.9గా రికార్డు అయ్యింది. ‌ 

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.   

ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపుగా మార్చి 1 నుంచి ఎండలు మండిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహైడ్రేట్‌ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Advertisement

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget