T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
టీ20 వరల్డ్ కప్ 2026ను ( T20 World Cup 2026 ) టీమిండియా విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచులో అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే నమీబియాతో జరిగే మ్యాచ్కు ముందు టీమిండియాకు ఓ సవాల్ ఎదురైంది. ఆ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) ఆడుతాడా లేదా అని. అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అనారోగ్యం కారణంగానే తొలి మ్యాచ్ ఆడలేదు. హర్షిత్ రాణా ( Harshit Rana ) గాయపడడంతో సిరాజ్ టీమ్ లోకి వచ్చాడు.
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత బ్యాటర్లు అమెరికా బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ( Suryakumar Yadav ) మినహాయిస్తే, మరే ఇతర బ్యాటర్ అంతగా రాణించలేదు. అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) గోల్డెన్ డక్ కాగా, తర్వాత ఫీల్డింగ్ చేయడానికి కూడా ఫీల్డ్ లోకి దిగలేదు. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కడుపునొప్పి, అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నాడని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
వాతావరణం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరంతో బాధ పడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కోలుకుని తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) ఢిల్లీలో టీమిండియాతో చేరతాడని సూర్యకుమార్ తెలిపాడు. నమీబియాతో మ్యాచ్ బుమ్రా ఆడితే, సిరాజ్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోతాడు. తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసినా కూడా బుమ్రా జట్టులోకి రావడంతో సిరాజ్ను బయటకు పంపించవచ్చు.























