అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులను రూపాయి కి ఏమి వస్తుందని అడిగితే మాత్రం తడుముకోకుండా సావిత్రమ్మ దోశ అని చెబుతారు. అవును సావిత్రమ్మ దోశ అంటే తాడిపత్రిలో అంత ఫేమస్ మరి. ఆ ప్రాంతంలో అవ్వ దోశలు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంత ఫేమస్ కావడానికి మరో కారణం వుంది. 1985 నుంచి సావిత్రమ్మ దోశలు వేస్తు జీవనం సాగిస్తోంది. అప్పట్లో పావలాకు ఒక దోశ ఇచ్చేది.కానీ ఇప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తప్పని పరిస్థితులలో దోశ ధర కూడా పెంచక తప్పలేదు. అవ్వ దోశ రూపాయి వద్ద స్థిరంగా నిలబడి పోయింది. దోశ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే తన ముగ్గురు పిల్లలను పెంచి పోషించింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. కుమారున్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకున్ని చేసింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా దోశలు వేస్తూ కష్టపడి సంపాదించే రూపాయి వెనుక ఉండే ఆనందాన్ని పొందుతుంది.
Kakani Govardhan Reddy On Kotamreddy Sridhar Reddy Phone Tapping: కోటంరెడ్డి వ్యవహారంపై స్పందన
Kotamreddy Sridhar Reddy Viral Audio: కోటంరెడ్డి ఆడియో అంటూ వైరల్ అవుతున్న క్లిప్
YV Subbareddy About Visakhapatnam As Capital: న్యాయపర అడ్డంకులు అధిగమిస్తామన్న సుబ్బారెడ్డి
Ainavilli Vinayaka Temple Special Poojalu: ఈ లక్ష పెన్నుల కోసం ఫుల్ పోటీ..! ఎందుకలా..?
Tirumala Vigilance Failure: మాడవీధుల దాకా వచ్చేసిన వాహనం, నిబంధనల ఉల్లంఘన
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం