అన్వేషించండి

Secunderabad - Goa Train: గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్ - నూతన రైలు సర్వీస్ ప్రారంభం, ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు

Telangana News: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - వాస్కోడగామా (గోవా) బైవీక్లీ ఎక్స్ ప్రెస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Secunderabad - Goa New Train Service Started: గోవా.. పర్యాటకులకు ఇష్టమైన ప్లేస్. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి గోవా (Goa) వెళ్లే ప్రయాణికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవా (Secunderabad - Goa Train) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటివరకూ వారానికి ఓ రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఆ రైలు గోవాకు వెళ్లేది. అలాగే, కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 బోగీలు తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణించేవారు. ఇప్పుడు తాజాగా పర్యాటకుల సౌలభ్యం దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా)కు బై వీక్లీ ఎక్స్ ప్రెస్ సర్వీసును ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది.

ఈ రూట్‌లో..

సికింద్రాబాద్ - గోవా మధ్య నూతన రైలు సర్వీసును అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ - గోవా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి,హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్ డెమ్, మడగావ్ జంక్షన్‌లో ఆగుతూ.. వాస్కోడగామా (గోవా) చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా (గోవా) నుంచి తిరిగి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణమవుతుంది.

ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు

సికింద్రాబాద్ నుంచి గోవాకు బైవీక్లీ కొత్త సర్వీస్ రైలు ప్రకటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల సికింద్రాబాద్ - గోవా రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడంతో పాటు ప్రయాణికులు సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మార్చి 16న రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీనిపై ఆలస్యమైంది. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మరోసారి ఈ ప్రాజెక్టు విషయాన్ని రైల్వే మంత్రిని కలిసి విన్నవించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి సికింద్రాబాద్ నుంచి గోవాకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెబుతూ.. కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read: Cyberabad Traffic Police: అప్పుడు కూడా లేన్ డిసిప్లిన్ పాటించరా? - కల్కీ 2898ఏడీపై పోలీసులు ఆశ్చర్యం!, సెటైరికల్ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Embed widget