అన్వేషించండి

CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం మొదలు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌరులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు, అందుకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు చేయడంతో మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటన చేశారు. ఇరాన్, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు పౌరులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భారత రాయబార కార్యాలయాల (Indian Embassies) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి బటయకు రావొద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతి తెలుగు పౌరుడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది
ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజల రక్షణ పట్ల ఆందోళన చెందడం సహజం. ఎందుకంటే లక్షలాది మంది తెలుగు వారు ఈ గల్ఫ్ దేశాలలోనే ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న తమ పౌరుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.

తెలంగాణ సీఎం కీలక సూచనలు
తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. తెలుగు సోదర సోదరీమణులందరూ సురక్షితంగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. అక్కడ చిక్కుకున్న వారిని పరిస్థితులను అర్థం చేసుకుని క్షేమంగా భారత్‌కు తరలించడానికి చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ను రేవంత్ రెడ్డి కోరారు. మొత్తం గల్ఫ్ ప్రాంతం యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న ఈ సమయంలో, సీఎం రేవంత్ ఇచ్చిన ఈ భరోసా అక్కడ నివసిస్తున్న వారి కుటుంబాలకు ఊరటనిచ్చింది.

పశ్చిమ ఆసియాలో దారుణమైన పరిస్థితులు
పశ్చిమ ఆసియాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అమెరికా,  ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేయగా, దానికి సమాధానంగా ఇరాన్.. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన అన్ని స్థావరాలు తమ మిస్సైల్ దాడుల పరిధిలోకి వచ్చాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఖతార్, కువైట్, యూఏఈ ఈ దాడులను ధృవీకరించాయి. యూఏఈలో మిస్సైల్ అడ్డుకునే క్రమంలో ఒక వ్యక్తి మరణించారు. హర్మూజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా కూడా నిలిచిపోయింది.

గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు
గల్ఫ్ సంక్షోభం సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి సవాలును ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తెలంగాణకు చెందిన 25 మందిని (ఏడుగురు ఇరాన్ నుండి, 18 మంది ఇజ్రాయెల్ నుండి) సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చారు. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget