అన్వేషించండి

Talasani Srinivas Yadav: రేపు షెడ్యూల్ ఇచ్చి, ఎన్నికలు పెట్టినా మేం సిద్ధం - మంత్రులు తలసాని, కొప్పుల

TS Ministers About Election Schedule : తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు.

TS Ministers About Election Schedule :

రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇందులో భాగంగా తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై పలు విమర్శలు చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ....

జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం బిజెపి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

రేపు షెడ్యూల్ ఇచ్చి రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమేనని తలసాని స్పష్టం చేశారు. వన్ ఎలక్షన్ నినాదం మోదీ ఇప్పుడు పెట్టింది కాదన్నారు. మోదీ క్రెజ్ దేశంలో పడిపోయిందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు.

ఎన్నికలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.....

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 115 మంది అభ్యర్థులతో మేము విడుదల చేసుకోవడం చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనం అని వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అని ప్రకటించారు. ఎన్నికలకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని ప్రకటించారు. కేంద్రానికి, బీఆర్ఎస్ మద్దతు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ ప్రకటించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు దళితులను, గిరిజనులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేందుకు దళితులు, గిరిజనులు అమాయకులు కాదన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణలో కాదని... కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఎవరు నమ్మేలా లేదని చెప్పారు. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుందన్నారు. " తెలంగాణలో మళ్లీ మేమే వస్తాం. మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తాం" అని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget