అన్వేషించండి

Talasani Srinivas Yadav: రేపు షెడ్యూల్ ఇచ్చి, ఎన్నికలు పెట్టినా మేం సిద్ధం - మంత్రులు తలసాని, కొప్పుల

TS Ministers About Election Schedule : తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు.

TS Ministers About Election Schedule :

రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇందులో భాగంగా తాము ఎన్నికలకు సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్లు వేరువేరు సమావేశాల్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై పలు విమర్శలు చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ....

జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. అనంతరం బిజెపి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

రేపు షెడ్యూల్ ఇచ్చి రాష్ట్రంలో ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమేనని తలసాని స్పష్టం చేశారు. వన్ ఎలక్షన్ నినాదం మోదీ ఇప్పుడు పెట్టింది కాదన్నారు. మోదీ క్రెజ్ దేశంలో పడిపోయిందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు.

ఎన్నికలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.....

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 115 మంది అభ్యర్థులతో మేము విడుదల చేసుకోవడం చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనం అని వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అని ప్రకటించారు. ఎన్నికలకు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయని ప్రకటించారు. కేంద్రానికి, బీఆర్ఎస్ మద్దతు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి భయపడే కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ ప్రకటించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు దళితులను, గిరిజనులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మేందుకు దళితులు, గిరిజనులు అమాయకులు కాదన్నారు. మల్లికార్జున ఖర్గే ఈ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణలో కాదని... కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఎవరు నమ్మేలా లేదని చెప్పారు. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పథకాలనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుందన్నారు. " తెలంగాణలో మళ్లీ మేమే వస్తాం. మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తాం" అని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget