అన్వేషించండి

TTD News: తెలంగాణ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఇక అనుమతిస్తారు !

TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖను టీటీడీ ఇక అంగీకరించనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడారు.

TTD will now accept the letter from Telangana public representatives:  తిరుమలలో తమ సిఫారసు లేఖలు అనుమతించాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న డిమాండ్ ను టీటీడీ ఆలకించింది. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అంగీకారించినట్లుగా తెలుస్తోంది.  వారానికి రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు ఏపీ సీఎం అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.  దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన చేయనుంది.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించాలని కొంత కాలంగా డిమాండ్            

కొద్ది రోజులుగా తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఆమోదించడం లేదని వివక్ష చూపిస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఈ విషయంలో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించారు. మంత్రి కొండా సురేఖ కూడా శ్రీశైలం ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఈ సిఫారసు లేఖల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ఈ కారణంగా టీటీడీ చైర్మన్ తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 

ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడిన టీటీడీ చైర్మన్            

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుోకవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ  బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.              

Also Read: Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

వారానికి రెండు లేఖల అనుమతి                         

వారానికి రెండు సిఫారసు లేఖల్ని అనుమతించేలా చూడాలని కోరడంతో ఆ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారు. ఈ లేఖలు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. తెలంగాణలో ఉన్న  119 మంది ఎమ్మెల్యేలు, 17 ఎంపీల లేఖలు చెల్లుబాటు అవుతాయి. మాజీ మంత్రులు, తర వీఐపీల లేఖలు మాత్రం చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవని అనుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget