అన్వేషించండి

Hyderabad middle class home dream: తెలంగాణ ప్రభుత్వం వేలం వెర్రి - చెదిరిపోతున్న మధ్యతరగతి ఇంటి కల !

Hyderabad: హైదరాబాద్ నలుమూలలా ఉన్న భూముల్ని ప్రభుత్వం వేలం వేస్తోంది. వాటికి రికార్డు ధరలు పలుకుతున్నాయి. కానీ అవేమీ మధ్యతరగతి ఇంటి కలను నిజం చేసే సంస్థలు కావు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Telangna government crushing Hyderabad middle class home dream :  హైదరాబాద్‌లో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సమీపానికి వెళ్లి ఓ 1000 ఎస్ఎఫ్టీ అపార్టుమెంట్ కొనుక్కోవాలంటే కనీసం కోటి రూపాయలు అవుతోంది. ఇక స్కై స్క్రాపర్లలో అయితే కనీసం రెండు కోట్లు అవుతోంది. ఓ మధ్యతరగతి జీవి .. కోటి పెట్టి ఇల్లు కొనగలరా?. రూ. 50 లక్షలు అయితేనే జీవితాంతం ఈఎంఐ కట్టుకుంటూ ఓ ఇల్లు కొనగలరు?. అలాంటి పరిస్థితుల్లో భూముల రేట్లను వేలం పెట్టి మరీ రికార్డుల మీద రికార్డులు సృష్టించే దిశగా అమ్ముతూంటే.. ఇక మధ్యతరగతికి అందుబాటులో ఇళ్లు ఉంటాయా?

కోకాపేట భూముల ఎఫెక్ట్ హైదరాబాద్ అంతటా !
  
ప్రభుత్వం కోకాపేట్‌లో భూములు వేలం వేస్తోంది. ఒక్క ఎకరానికి 150 కోట్లు దాటిపోతోంది. ఈ ధరలు చూస్తుంటే సామాన్యులకు ఇల్లు కొనడం కలలా మారిపోయింది. ఈ వేలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బాగా లాభం చేస్తున్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు  భూములు కొని లగ్జరీ ఫ్లాట్లు కడుతున్నాయి. కోకాపేటలో ఒక్కో ఫ్లాట్ 4 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఫ్లాట్లు కొనేవాళ్లు కేవలం బాగా సంపాదించే వాళ్లే. కోకాపేట్ ధరలు పెరిగితే దాని పక్కనే ఉన్న మణికొండ, నర్సింగి, గచ్చిబౌలి ధరలు కూడా పెరుగుతాయి. ఆ తెల్లాపూర్, ఆ తర్వాత కొల్లూరు వరకూ ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే కనీసం 1.5 నుంచి 2 కోట్లు కావాలి.  

మధ్యతరగతి గురించి ఆలోచించని ప్రభుత్వం 

ప్రభుత్వానికి వేలం ద్వారా వేల కోట్లు వస్తున్నాయి. ఆ డబ్బుతో రోడ్లు, మెట్రో విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు  చేస్తామని అంటోంది. కానీ పథకాల అమలు కోసమే అని అందరికీ తెలుసు.   ఇప్పుడు హైదరాబాద్‌లో రెండే రకాల ఇళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి – చాలా ఖరీదైన లగ్జరీ ఫ్లాట్లు, లేదా నగరం బయట చాలా దూరంలో ఉండే చిన్న ఫ్లాట్లు. మధ్యలో మధ్యతరగతి వాళ్లకు తగిన ఇళ్లు దాదాపు లేవు.  గతంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మాత్రమే ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు కోకాపేట్, గచ్చిబౌలి కూడా అలాంటి స్థాయికి వచ్చేశాయి. ఇక హైదరాబాద్ నగరం మొత్తం మధ్యతరగతి వారికి ఇల్లు లేదు అన్నట్టు మారిపోతోంది. ప్రభుత్వం ఇలాగే వేలాలు పెడుతూ పోతే రేపు మధ్యతరగతి వాళ్లు నగరం బయటకు వెళ్లిపోవాల్సి వస్తుంది. లేదా ఇల్లు కొనే కలనే వదులుకోవాల్సి వస్తుంది. డబ్బు ఉన్నవాళ్లకు హైదరాబాద్ స్వర్గం అయిపోతోంది. డబ్బు లేని వాళ్లకు ఇక్కడ స్థలం లేకుండా పోతోంది.

తక్కువ ధరకు భూములు ఇస్తే అందుబాటు ఇళ్లు నిర్మిస్తామంటున్న బిల్డర్లు

ప్రభుత్వం ఆదాయం మాత్రమే చూసుకుంటోంది. వేలం వల్ల  ఏర్పడే సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పును ఊహించడం లేదు. కొంత మంది బిల్డర్లు భారీగాఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేయడం వల్ల ఆ ప్రభావం హైదరాబాద్ మొత్తం పడుతుంది. రియల్ ఎస్టేట్ భూమ్ ఉందని చెప్పి అన్ని చోట్లా ధరలు పెంచుతారు. గత కొంత కాలంగా ఇదే జరుగుతోంది.  చిన్న బిల్డర్లు.. ఏ సౌకర్యాలు లేని అపార్టుమెంట్లలోనే ఇప్పుడు డబుల్ బెడ్ రూం 70 లక్షలకు అమ్ముతున్నారంటే.. ఇక సామాన్యుడు ఎలా  సొంత ఇంటి కలను నిజం చేసుకోగలడు.  హైదరాబాద్‌లో ఒక్క ఐటీ వర్గం... అది కూడా ఉన్న వైట్ కాలర్ జాబ్స్ చేసే వారికి మాత్రమే ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.  వారి డిమాండ్ పరిమితం. త్వరలో ఈ బూమ్ బద్దలయ్యే అవకాశం ఉంది. మరో వైపు  మధ్యతరగతికి అందుబాటు ధరల ఇళ్లను నిర్మించడానికి సిద్ధమే కానీ.. భూమి తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తే చాలని అంటున్నారు. వందల కోట్లు పెట్టి  భూమి కొని.. తక్కువ ధరలకు ఎలా అమ్ముతామని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఆదాయం  కోసమే వేలం వెర్రిగా భూములను వేలం వేస్తే.. ఆ ప్రభావం మధ్యతరగతిపై ఎక్కువగా పడుతోంది. దీనికి పరిష్కారాన్ని ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిందే.      

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget