అన్వేషించండి

Telangana Politics : కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీలోనే - తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు చాన్స్ !

తెలంగాణ రాజకీయాలు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారాయి. రెండు పార్టీల అగ్రనేతలు ఢిల్లీలో మకాం వేశారు.


Telangana Politics :   తెలంగాణ లో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది.  రెండు జాతీయ పార్టీల నేతలు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసింది. కీలక నేతలంతా హస్తినకు చేరుకుని పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చేరికలను ఎలా ప్రోత్సహించాలి.. పోయే వారిని ఎలా ఆపాలి.. పార్టీలోకి వచ్చే వారికి ఎలాంటి హామీలు ఇవ్వాలన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యాలయంలో నేతల సందడి కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా హైకమాండ్  పిలిపించడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రారంభమయింది. 

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు                        

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా నేతలంతా ఏఐసీసీ కార్యాలయంకు వెళ్లారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు మరికొంత మంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరందరూ రాహుల్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశం కోసం.. అగ్రనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. ముందు ముందు తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి..  గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్నదానిపై రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. 

ఢిల్లీకి బండి సంజయ్                      

మరో వైపు తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది.  ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.  శనివారం వారిని బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి  అమిత్ షా, నడ్డా  మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఢిల్లీలోనే ఉండిపోయారు.  ఆదివారం జేపీ నడ్డా తెలంగాణలోని నాగర్ కర్నూలు పర్యటనకు వచ్చారు. అయితే ఆ నేతలు మాత్రం తెలంగాణకు రాలేదు. మధ్యాహ్నం వరకు రాజగోపాల్ రెడ్డితో ఈటల మంతనాలు సాగించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు తమ పార్టీ జాతీయాధ్యక్షుడి కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వివిధ రకాల ఊహాగానాలు చెలరేగాయి.  పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని, అందరినీ కలుపుకోకుండా ముందుకెళ్తే గెలుపు కష్టమని చెప్పినా హైకమాండ్ పట్టించుకోవడం లేదని పూర్తి స్థాయిలో హామీ కూడా రావడం లేదని వారంటున్నారు. వీరి అంశంపై హైకమాండ్ ..  బండిసంజయ్‌తో చర్చించే అవకాశం ఉంది. 
 
త్వరలో రెండు పార్టీల్లో కీలక మార్పులు                     

ఎన్నికలు జగ్గర పడుతూ ఉండటంతో రెండు జాతీయ పార్టీల తెలంగాణ శాఖల్లో హడావుడి పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి పీఠం దక్కించుకోవాలని పోరాటం చేస్తున్న జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా తమ స్థానిక నేతల్ని పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు అప్పగిస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వచ్చే కొద్ది రోజుల్లో రెండు పార్టీల్లోనూ కీలక నిర్ణయాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget