అన్వేషించండి

Indian Railways: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసింది. అక్టోబర్ 18 నుంచి సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్ సోల్ రైళ్ల టైమింగ్స్ మార్చింది.

SCR Four Trains Timings Changed: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలోని నాలుగు రైళ్ల ప్రయాణ సమయాలు మారుస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింహపురి, పద్మావతి, నారాయణాద్రి, నాగర్‌సోల్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి మారిన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. 

రైళ్ల వేళల్లో మార్పులు

  • సికింద్రాబాద్ - గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్ ప్రెస్ (12710)లో గమ్యస్థానం చేరేందుకు ప్రస్తుతం 10.35 గంటలు పడుతోంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 11:05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9:40కు గూడూరు చేరుతుంది. అయితే, మారిన ప్రయాణ వేళల ప్రకారం రాత్రి 10:05 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై ఉదయం 8:55 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. గతం కంటే ప్రయాణ సమయం ఓ 15 నిమిషాలు పెరగనుంది. ఈ రైలు విజయవాడకు వేకువజామున 3:35కి చేరుతుంది.
  • అలాగే, సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ (12764) రైలు ప్రయాణ వేళలు గూడూరు స్టేషన్ నుంచి మారనున్నాయి. గూడూరుకు తెల్లవారుజామున 4:43కి బదులుగా 4:19కి చేరుకుంటుంది. తిరుపతి స్టేషన్‌కు ఉదయం 6:55కు చేరుకుంటుంది. గతంలో తిరుపతి స్టేషన్‌కు 7:15కి చేరుకునేది. 
  • అటు, లింగంపల్లి - తిరుపతి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ (12734) సాయంత్రం 6:25కి బదులుగా సాయంత్రం 5:30కి బయలుదేరనుంది. ఉదయం 5:55 గంటలకు తిరుపతి చేరుకోనుంది. గతంలో ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకునేది. ఈ రైలు ప్రయాణ సమయం 12:35 గంటల నుంచి 12:25 గంటలకు తగ్గనుంది. ప్రయాణ సమయం 10 నిమిషాలు ఆదా కానుంది.
  • నర్సాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌కు వెళ్లే నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ (17231) ప్రయాణ సమయం 10:30 నుంచి 9:40కి తగ్గనుంది. ప్రస్తుతం రాత్రి 11:15 కు బయల్దేరి ఉదయం 9:45కి చేరుకుంటుండగా కొత్త టైమింగ్స్ ప్రకారం రాత్రి 9:50కి బయల్దేరి ఉదయం 7:30కి చేరుకుంటుంది.

పలు రైళ్ల దారి మళ్లింపు

అటు, విజయవాడలో రైల్వే ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట - విజయవాడ - విశాఖ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించారు. దాదాపు 30 రైళ్లను విజయవాడ స్టేషన్‌కు రాకుండా నగర శివార్లలోని బల్బ్ లైన్ మీదుగా విశాఖ మార్గంలోకి మళ్లించనున్నారు. ఆగస్ట్‌లో దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ - విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడ రాకుండా దారి మళ్లిస్తారు. ఈ రైళ్లన్నీ విజయవాడ నగర శివార్లలోని రాయనపాడు మీదుగా రాజేశ్వరిపేట, అయోధ్యనగర్, మధురానగర్, గుణదల మీదుగా రామవరప్పాడు లైన్‌లో ప్రయాణిస్తాయి.

సికింద్రాబాద్ - విశాఖపట్నం (12740), ఓఖా - పూరీ (20820), షిర్డినగర్ - విశాఖపట్నం (18504), విశాఖపట్నం - షిర్డిసాయినగర్ (18503), షిర్డినగర్ - కాకినాడ పోర్ట్ (17205), గాంధీనగర్ - విశాఖపట్నం (20804), హైదరాబాద్ - విశాఖపట్నం (12728), విశాఖపట్నం - సికింద్రాబాద్ (12739), నిజాముద్దీన్ - విశాఖపట్నం (12804), చత్రపతి శివాజీ టెర్మినల్ - భువనేశ్వర్ (11019), న్యూఢిల్లీ - విశాఖపట్నం (20806),  విశాఖ - న్యూఢిల్లీ (20805), యశ్వంత్ పూర్ - టాటా (18112), హైదరాబాద్ - షాలిమార్ (18046), షాలిమార్ - హైదరాబాద్ (18045), విశాఖ - నిజాముద్దీన్ (12803), నర్సాపూర్ - నాగర్ సోల్ (12787), నాగర్ సోల్ - నర్సాపూర్ (12788), లోకమాన్య తిలక్ - విశాఖ (18520), బీదర్ - మచిలీపట్నం (12759) రైళ్లను ఆగస్ట్ 2 నుంచి 10 మధ్య దారి మళ్లిస్తారు.

Also Read: Tirumala : తిరుమల క్యూలైన్లలో తమిళ ఆకతాయిల ప్రాంక్ వీడియోలు - వార్నింగ్ ఇచ్చిన టీటీడీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget