(Source: Matrize | *Exit polls are projections; official results on May 4, 2026)
Revanth Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బొందపెట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం - కేసీఆర్కు సవాల్ - మేడిగడ్డ గడ్డపై రేవంత్ రెడ్డి ఉగ్రరూపం
CM Revanth: వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మేడిగడ్డ బహిరంగసభలో తీవ్ర విమర్శలు చేశారు.

Revanth Reddy challenged KCR: కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగినందుకు, ఇది గనుక ఏదైనా ఆటవిక రాజ్యమైతే అపరాధులను చెట్టుకు ఉరేసేవారని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే సీబీఐ విచారణకు ఆదేశించామని, లేదంటే ప్రజలే బుద్ధి చెప్పేవారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారానికి మేడిగడ్డ కూలిన పిల్లర్లే సాక్ష్యమని ఆయన దుయ్యబట్టారు.
కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల సభను లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగిత్యాల గడ్డపై కేసీఆర్ను వంద మీటర్ల గోతిలో పాతర వేయడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణాకు పాపాల బైరవుడు అయిన కేసీఆర్ అవసరం లేదని, ప్రజా పాలనను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. కేసీఆర్ రీ-లాంచ్ సభ కేవలం తన పాపాలను కప్పుకోవడానికేనని రేవంత్ విమర్శించారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఉన్న కేసీఆర్ చెంతకు వెళ్లిన జీవన్ రెడ్డికి, ఇకపై పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత లేదని ఎద్దేవా చేశారు. కేవలం మంత్రి పదవి రాలేదన్న అక్కసుతోనే, 40 ఏళ్లు తనను నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి వెళ్లడం ఆయన నైతిక పతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నా కార్యకర్తలు ఊడిగం చేశారు.. మరి వారికేం సమాధానం చెబుతావు అని నిలదీశారు.
ఎన్నికలు ఎన్నడు వచ్చిన ఒక్క మాట గుర్తుపెట్టుకొండి KCR గారు..🔥#RevanthReddy pic.twitter.com/mC3NI7tFln
— Kattar Congress (@kattarcongresii) April 20, 2026
అంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, ఇంజనీర్ల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రాజెక్టును ఎలా నాశనం చేశారో ప్రజలకు వివరించారు. 2020లోనే పగుళ్లపై నివేదికలు వచ్చినా, కేవలం కమిషన్ల కోసం కేసీఆర్ సర్కార్ ఆ విషయాలను తొక్కిపెట్టిందని ఆరోపించారు. ప్రకృతి ఈరోజు ఆ అవినీతిని బయటపెట్టిందని, లక్ష కోట్లు గంగలో పోసిన పాపం కేసీఆర్ కుటుంబానిదేనని అన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తూ, ప్రభుత్వం రైతు పక్షపాతని మరోసారి నిరూపించుకున్నారు.
ఒకే రోజు అటు జగిత్యాలలో కేసీఆర్, ఇటు మేడిగడ్డలో రేవంత్ రెడ్డి సభలు నిర్వహించడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రేవంత్ రెడ్డి ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, తెలంగాణ ఆస్తులను దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















