అన్వేషించండి

Weather Latest Update: బలహీన పడిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోంది. దాని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమేపీ బలహీన పడుతోంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఇదివరకే మోస్తరు వానలు పడుతున్నాయి. రాయలసీమ పొడిగా ఉంటున్నా, ఒకట్రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 48 గంటల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుంది. బలమైన ఈదరుగాలులు సైతం వీచనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు నమోదు కానుంది. వాయువ్య దిశ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నగరం వైపు గాలులు వీచనున్నాయి.

తెలంగాణలో గురువారం వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచనున్నాయి. తెలంగాణలో వర్ష సూచనతో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఉత్తర ప్రాంతాలైన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఇటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి దక్షిణ ప్రాంతాలైన రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు.

శుక్రవారం ఆ ప్రాంతాల్లో వర్షాలు
అల్పపీడనం బలహీనపడినా శుక్రవారం నాడు తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచనున్నాయి. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,  మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు.

ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. 
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ అంతర్భాగంగా విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపునకు వంగి ఉంటుంది. ఏపీలో గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు యానాం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget