అన్వేషించండి

Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి

Minsiter Errabelli : వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి హర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. రామస్వామి మరణ వార్త తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Minsiter Errabelli : వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొండూరుకు చెందిన బీఆర్ఎస్ నేత గుండె రామస్వామి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.  పాడేమోసిన ఆయన... రామస్వామితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి సోమవారం ఉదయం గుండె పోటుతో మరణించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ నుంచి కొండూరు చేరుకున్నారు. కొండూరులో రామస్వామి అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు. రామస్వామితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నారు. రామస్వామి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. రామస్వామి కొడుకు తొర్రూరు మున్సిపాలిటీ మాజీ కమిషనర్ గుండె బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండె రామస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. 

బడ్జెట్ లో కేటాయింపులపై మంత్రి ఎర్రబెల్లి హర్షం 

ఈ ఏడాది 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ బడ్జెట్ లో 31,426 కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించడంపై పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని మంత్రి అభివర్ణించారు. అదే విధంగా ఆసరా పెన్షన్లకు 12 వేల కోట్ల రూపాయలు, మిషన్ భగీరథకు రూ.600 కోట్లు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  మహాత్మా గాంధీ చెప్పిన పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటలను ఆచరణలో అమలు చేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పల్లె ప్రగతి చేపట్టి తెలంగాణ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, స్వయం సమృద్ధిగా తయారు చేశారన్నారు. దేశానికి తెలంగాణ పల్లెలు రోల్ మోడల్ గా మారాయని, అభివృద్ధిలో అందరితో పోటీ పడి మొదటి స్థానంలో నిలుస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాయన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో 13 జాతీయ అవార్డులు సాధించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. 

పంచాయతీ రాజ్ శాఖకు ఎక్కువ నిధులు 

 హరిత హారంలో భాగంగా 710 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేశామన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 238 కోట్ల రూపాయలతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, 279 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులు నిర్మించి చెత్త నుంచి డబ్బులు సంపాదిస్తున్నామన్నారు. 1330 కోట్ల రూపాయలతో వైకుంఠ ధామాలు నిర్మించి అంతిమ సంస్కారాలు గౌరవంగా జరుపుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ విధంగా దాదాపు 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి 5 విడతల పల్లె ప్రగతిని విజయవంతంగా, రాష్ట్రం గర్వించేలా నిర్వహించామన్నారు. 4209 కోట్ల రూపాయలతో 8160 కిలో మీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను చేపట్టి రవాణా వ్యవస్థను  గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో రూ.2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పథకాలు మరింత గొప్పగా నిర్వహించేందుకు ఈ బడ్జెట్లో అత్యధిక నిధులు రూ.31,426 కోట్లు కేటాయించి, 12 వేల కోట్లు ఆసరాకు ఇచ్చి, రూ.600 కోట్లు మిషన్ భగీరథకు కేటాయించడం ద్వారా తన శాఖలకు బడ్జెట్లో రూ.44,026 కోట్ల రూపాయలను ప్రతిపాదించారన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget