అన్వేషించండి

Nizamabad News: బ్లాక్ లిస్టులో పెట్టిన వారికి పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విధులు - అధికారుల తీరుపై విమర్శలు

బ్లాక్ లిస్టులో పెట్టిన వారికి పదో తరగతి పరీక్షా సెంటర్లలో విధులు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులపై ఆరోపణ. కొందరు టీచర్లకు ఏ సెంటర్లలో విధులు వేశారో తెలియని వైనం. అంతా గందరగోళం

ఇప్పటికే పేపర్ లీకుల పేరుతో విద్యార్థులు గందరోగళానికి గురవతున్న పరిస్థితి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల తీరు ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టానుసారంగ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న పద్దతి అనుమానస్పదంగా ఉంది. గతంలో మాస్ కాపీయిం గ్ చేయిస్తూ దొరికి, శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెట్టిన ఉపాధ్యాయులను ఈ ఏడాది పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో డ్యూటీలు ఎలా వేశారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
నిజామాబాద్ నగరంలోని గోల్డెన్ జూబ్లీ స్కూల్ పరీక్ష కేంద్రంలో 2018లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో మాస్ కాయిపీంగ్ కు సహకరించారనే ఆరోపణలపై నలుగురు టీచర్లను నాటి విద్యాశాఖ అధికారి విధుల నుంచి తొలగించారు. ఇంతే కాదు ఆ నలుగురు టీచర్లను శాశ్వతంగా ఎలాంటి పరీక్షల విధులకు కేటాయించవద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఈ నిబంధనలు మార్చి అధికారులు విధులు కేటాయించడంలో మతలబేంటనే దానిపై చర్చ జరుగుతోంది. విద్యాశాఖ ఎవరి కోసం పనిచేస్తుంది? పదో తరగతి పరీక్షల్లో బ్లాక్ లిస్టులో ఉన్న ఓ ఉపాధ్యాయున్ని విద్యాశాఖ అధికారులు ఇన్విజిలేటర్ డ్యూటీ వేసినట్లు సమాచారం. దీనిపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అభ్యంతరం వ్యక్తం చేసినా... అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడి కూతురు మోపాల్ కేంద్రంలో పదో పరీక్ష రాస్తున్నందున బ్లాక్ లిస్టులో ఉన్న టీచర్ ను ఇన్విజిలేటర్ డ్యూటీ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ పీ.ఆర్.టీ.యూ ఉపాధ్యాయ సంఘం నాయకుడి కోసం విద్యాశాఖ నిబంధనలు మార్చిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదో తరగతి పరీక్ష సెంటర్లలో ఆ విధులు నిర్వహించే వారిని నియమించడంలో ఉపాధ్యాయ సంఘాలు పెత్తనం చెలాయిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ నాయకుల కనుసన్నల్లో విద్యాశాఖ - పనిచేస్తుందనేందుకు ఇది ఉదాహరణ అంటున్నారు. విద్యాశాఖను నడిపిస్తుంది ప్రభుత్వమా? ఉపాధ్యాయ సంఘాలా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి వివాదస్పదమే అవుతోందని అంటున్నారు. పదో తరగతి పరీక్షల విధుల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పిన వారికి డ్యూటీలు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంతకు బ్లాక్ లిస్టులో ఉన్న టీచర్లకు పరీక్ష విధులు ఎలా కేటాయించారు? నిబంధన లు సడలించారా? మరి మిగతా ముగ్గురు టీచర్లకు పదో తరగతి పరీక్షల డ్యూటీలు వేశారా? వేస్తే ఎక్కడ డ్యూటీలు వేశారు? వేయకుంటే ఎందుకు వేయలేదు? తమకు కావల్సిన వారి పిల్లల కోసం విద్యాశాఖ అధికారులు ఏమైనా చేయగలరా? వీటన్నింటికి జిల్లా విద్యాశాఖ అధికారులు - సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరి కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా విద్యాశాఖ అనుసరిస్తున్న విధానాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. బ్లాక్ లిస్టులో పెట్టిన వారిని డ్యూటీలకు ఎలా వేస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Fake Note Racket: మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్, ఏపీ నుంచి తెచ్చి చెలామణి చేస్తున్న గ్యాంగ్
మంచిర్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్, ఏపీ నుంచి తెచ్చి చెలామణి చేస్తున్న గ్యాంగ్
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Rajinikanth - Shah Rukh Khan: కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
కమల్ తర్వాత షారుఖ్‌తో... అనిరుధ్ డ్రీమ్ కాంబో - రజనీతో మల్టీస్టారర్ సెట్టయ్యేనా?
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
టీ20లో టీమిండియా నెంబర్ 1 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన SKY
Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
Santosh Nagar Steel Bridge: ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
ఇలా పనులు చేస్తే కార్మికులకే కాదు రోడ్డున పోయే వారికీ నో గ్యారంటీ - హైదరాబాద్‌లో ఇంత ప్రమాదకరదృశ్యాలను ఎప్పుడూ చూసి ఉండరు !
Embed widget