అన్వేషించండి

ఒకప్పుడు కంచు కోటగా ఉన్న ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థి కరవు ?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. నేడు అభ్యర్థి కరువు. నియోజకవర్గం ఏర్పాటు తర్వత 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 8 సార్లు కాంగ్రెస్ గెలుపు. అరువు అభ్యర్థి కోసం పాట్లు.

నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర, దేశ స్థాయిలో చక్రం తిప్పిన నేతలు ఉన్నారు. అలాంటిది ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో హస్తం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకుడే కరవయ్యారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకున్న ఆర్మూర్ కోటను బద్ధలు కొట్టేసింది టీఆర్ఎస్. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి శనిగరం సంతోష్ రెడ్డి నాటి బలమైన కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి గులాబీ పార్టీ సత్తా చాటారు. 2009లో టీడీపీ నుంచి అన్నపూర్ణమ్మ గెలిచారు. 2014, 2019 వరుసగా రెండు సార్లు మళ్లీ టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గాన్ని క్యాప్చర్ చేసింది. 

ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక 1957లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టి. అంజయ్య 15,454 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు తర్వాత మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా అందులో 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. 3సార్లు టీడీపీ, 3 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్దండులు ఎమ్మెల్యేలుగా అయ్యారు. టి. అంజయ్య మొదలుకుని తుమ్మల రంగారెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, ఏలేటీ మహిపాల్ రెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రస్తుతం టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే ఆశన్నగారి జీవన్ రెడ్డి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలిత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆమె టీఆర్ఎస్ కు సరెండర్ అయ్యారు. అయినా కాంగ్రెస్ గుర్తు మీద భారీగానే ఓట్లు పడ్డాయ్. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే నాయకుడు కరవయ్యాడు. 2014 ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనే ఇచ్చింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాగేయటంతో... ఇతర సెకండ్ క్యాడర్ లీడర్లను గులాబీ గూటికి చేర్పించుకోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో బలహీనపడుతూ వచ్సింది. గతంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బాల్కోండను కాదని ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే సురేష్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆర్మూర్ నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉండేవారు. ఆర్మూర్ కాంగ్రెస్ క్యాడర్ ను ఆయన కాపాడుకుంటూ వచ్చారు. సురేష్ రెడ్డి సైతం కారు పార్టీలో చేరటంతో ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాథగా మారిందంటున్నారు లోకల్ లీడర్లు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఆర్మూర్ నియోజకవర్గంలో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బలమైన లీడర్ ఎంతైనా అవసరం. ఇప్పుడున్న సిచ్యూయేషన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆర్మూర్‌లో లీడరే దొరకటం లేదన్న వాదన వినిపిస్తోంది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారమైతే జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ గతంలో నిజామాబాద్ అర్బన్, రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఈసారి ఆర్మూర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారా లేక కొత్త అభ్యర్థిని అక్కడ ప్రమోట్ చేస్తారా అన్నదానిపై ఇంకా కాంగ్రెస్ వర్గాల్లో క్లారిటీ కనిపించటం లేదు. 

ఆర్మూర్ నుంచి అరువు నేతలే పోటీకి సై....

కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు ఇతర పార్టీలో కూడా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి అరువు తెచ్చుకున్న లీడర్లే గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయ్. అరువు నేతలను ఆర్మూర్ ప్రజలు గెలిపించుకున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తి చూపిస్తే అతని టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ అది వర్కౌట్ అవుతుందా అన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడినట్లు తేెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆ సమయానికి ఎవరైనా బలమైన లీడర్ కాంగ్రెస్ వైపు చూడకపోరా అన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం శ్రమించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా అన్నది చూడాలి మరి.

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget