అన్వేషించండి

Revanth Reddy on SLBC Project: ఎస్‌ఎల్‌బీసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి డెడ్‌లైన్

Telangana CM Revanth Reddy | శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను వెంటనే ప్రారంభించాలని, 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

SLBC Project | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా తక్షణం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ 9 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించడమే కాక, రాష్ట్రానికి దీర్ఘకాలిక నీటి సరఫరాలో కీలకపాత్ర పోషించే ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతికతతో, ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా, పనులు భద్రంగా కొనసాగేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం భారత సైన్యంలో అనుభవం ఉన్న ఇంజినీరింగ్ నిపుణుల సేవలు వినియోగించాలని నిర్ణయించారు.

అధికారులు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, మాజీ ఆర్మీ ఇంజనీర్ ఇన్‌చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్, ఇతర నిపుణులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో ఎన్జీఆర్ఐ, జీయోలాజికల్ సర్వే వంటి సంస్థల నిపుణుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగాలని నిర్ణయించారు.

ఆదర్శ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి
దేశ, విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్టులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదర్శంగా నిలిచేలా నిర్మాణం జరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇది ఒక కేస్ స్టడీగా ఉపయోగపడేలా ప్రభుత్వం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. అటవీ శాఖ, ఇంధన శాఖ, నీటిపారుదల శాఖలతో తక్షణమే సమన్వయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15లోగా కేబినెట్ సమావేశం నిర్వహించి, అవసరమైన అనుమతులు, నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. పనులు అడ్డంకులు లేకుండా కొనసాగేందుకు ఒకే సమావేశంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని చెప్పారు.

టన్నెల్ పనులు వేగవంతం
ప్రస్తుతం 44 కిలోమీటర్ల టన్నెల్‌లో 35 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయని, మిగిలిన 9 కిలోమీటర్ల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెల కనీసం 178 మీటర్ల తవ్వకాలు పూర్తి చేస్తూ జనవరి 2028 నాటికి మొత్తం టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టన్నెల్ తవ్వకాలలో ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు హెలీ-బోర్న్ సర్వే నిర్వహించాలని నిర్ణయించబడింది. దీనిని ఎన్జీఆర్ఐ ద్వారా చేపట్టనున్నారు.

కాంట్రాక్టు సంస్థలకు స్పష్టమైన హెచ్చరిక
జేపి అసోసియేట్స్ సంస్థ టన్నెల్ పనులకు అవసరమైన అన్ని పరికరాలు సిద్ధం చేసుకోవాలని, ఒక్క రోజు ఆలస్యం జరిగినా సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఇన్లెట్, ఔట్లెట్ రెండు వైపుల నుంచి సమాంతరంగా పనులు జరగాలని, అవసరమైన నిపుణులు, కార్మికులు, యంత్రాలు రంగంలోకి దిగాలని ఆదేశించారు.

గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల
ప్రాజెక్ట్ పనులకు నిధుల కొరత కలగకుండా, ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ గ్రావిటీ ఆధారంగా నీటి పంపిణీ చేయగల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ అని పేర్కొంటూ, ఇది ప్రజల కలల ప్రాజెక్ట్‌గా వర్ణించారు.

SLBC తుది గడువు: డిసెంబర్ 9, 2027
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ గడువు విధించారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా ప్రతి 3 నెలలకోసారి ప్రణాళిక రూపొందించాలనీ అధికారులకు ఆయన సూచించారు. కాగా, కొన్ని నెలల కిందట ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన ప్రమాదలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, ఇతర విభాగాలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి బాగోలేదని పనులు మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget