By: ABP Desam | Updated at : 19 Oct 2021 02:13 PM (IST)
Edited By: Venkateshk
యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి క్యాన్వాయ్లో ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ఈవో సహా అధికారులు, జిల్లా అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. తొలుత సీఎం కేసీఆర్ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్తో పాటు పలువురు నాయకులను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ పరిసరాలు మొత్తం కలయ తిరిగారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు అన్ని వివరాలు చెప్పారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
తొలుత సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత కాన్వాయ్లో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. దాదాపు పూర్తయిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆలయ పునఃప్రారంభ ముహూర్తం, తేదీని సీఎం ప్రకటిస్తారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగానే ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ డిజైనర్ ఆనంద్ సాయి తదితరులు ఉన్నారు.
నాలుగేళ్ల కింద యాదాద్రి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా సీఎం కేసీఆర్ దాదాపు 15 సార్లు యాదాద్రి వెళ్లి పనులపై సమీక్ష జరిపారు. దాదాపు రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో ఈ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
అదిగదిగో యాదాద్రి! ప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాదాద్రి #Yadadri #yadadritemple #SriLakshmiNarasimhaSwamyTemple @KTRTRS @kp_vivekanand @RajuShambipur pic.twitter.com/5hUQpTbrDj
— B. RAVI KIRAN YADAV TRSV (@RaviKiranTRSV3) October 19, 2021
పసిడి వర్ణ విద్యుత్ కాంతుల్లో దివ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. #Yadadri pic.twitter.com/NVgmT9nd3U
— TRSTrending® (@TRSTrending) October 19, 2021
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
Nalgonda Crime : నల్గొండలో దారుణం, ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి
Gutha Sukender Reddy: కుటుంబ పాలనపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం - గుత్తా సుఖేందర్ రెడ్డి
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Rains in AP Telangana: వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం - నేడు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, IMD రెడ్ అలర్ట్
Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!
Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?
Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!