అన్వేషించండి

Motkupalli Join TRS: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ 

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Motkupalli Narasimhulu Join TRS: ఉమ్మడి నల్గొండకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు టీఆర్ఎస్ పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా ఊహించినట్లుగానే మోత్కుపల్లి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తనకు పార్టీలో చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, శాసనమండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆయన దారి చెప్పకనే చెప్పారు..

ఇటీవల దళితబంధు పథకంపై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటాడని ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో మోత్కుపల్లి చేరికపై ఇటీవల క్లారిటీ వచ్చింది. అనుకున్న ప్రకారంగానే తెలంగాణ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజనకు ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలలో మోత్కుపల్లి ఒకరు. ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన దారెటు అని ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పరోక్షంగా తన వ్యాఖ్యలతో గులాబీ గూటికి చేరనున్నట్లు చెప్పకనే చెప్పారు మోత్కుపల్లి.

Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ? 

చేరికకు ముందే కేసీఆర్‌పై ప్రశంసల వర్షం..

టీఆర్ఎస్‌లో చేరకముందు నేటి ఉదయం సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శంస‌లు కురిపించారు. రాష్ట్ర ప్రజలను, పేదలను ఆదుకునే నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా నగరంలోని ట్యాంక్‌బండ్ పై ఉన్న రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హానికి, బ‌షీర్‌బాగ్‌లోని బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల మాలలు వేశారు. గ‌న్‌పార్కులో అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ు అర్పించారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ప్రతి వర్గానికి అండగా ఉంటున్నారని ప్రశంసించారు. రైతులను రాజుకు చేసేందుకు రైతు బంధు లాంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.

Also Read: ఈటలను చిత్తు చేయండి.. హరీశ్ రావు వ్యాఖ్యలు, సొంత ఇలాకాలో మంత్రికి షాక్ 

దళితవాదంతో టీఆర్ఎస్ గూటికి..?
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ దళితబంధు అస్త్రాన్ని ప్రయోగించారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల మేర ఆర్థిక ప్రయోజనం అందించి వారి జీవితాలను మార్చాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మోత్కుపల్లి నర్సిహులును టీఆర్ఎస్‌లో చేర్చుకుని ఆ పథకానికి సంబందించిన కీలక బాధ్యతలు మోత్కుపల్లికి అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. తమ పార్టీలో చేరనున్న మోత్కుపల్లికి ఎమ్మెల్సీగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: బీజేపీకి భారీ షాక్, పార్టీకి మాజీ మంత్రి రాజీనామా

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటేChiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
IPL 2024: రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Embed widget