అన్వేషించండి

Revanth Reddy : చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా- రేవంత్ రెడ్డి

Revanth Reddy : పేదల పక్షాన కొట్టాడి జైలుకెళ్లానని, ఒక్కసారి కాదు పేదల కోసం 100 సార్లు జైలు కెళ్తానన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy : దేశంలోనే మొట్టమొదటి గురుకుల పాఠశాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని గోతికాడి నక్కల్లా బీజేపీ, టీఆర్ఎస్ ఎదురుచూశాయన్నారు. దేశంలో కాంగ్రెస్ పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.  తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టారని రేవంత్ విమర్శించారు. తాను దొంగతనం చేసి జైలుకు పోలేదన్నారు. పేదల పక్షాన కొట్లాడి జైలుకెళ్లానన్నారు. తాను జైలుకెళ్లానని గర్వంగా చెబుతున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కసారి కాదు పేదల కోసం 100 సార్లు జైలుకెళ్తానన్నారు. తాను తిన్న చిప్పకూడు సాక్షిగా చెబుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానన్నారు.  

చంటి పిల్లల పాలపై జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది 

"కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నారు.  ఇక్కడి గ్రామాలకు సరైన రోడ్లు వేయనివారు ఇక్కడ అభివృద్ధి చేస్తారా? మునుగోడుతో మాకు ఎంతో అనుబంధం ఉంది. దివంగత జైపాల్ రెడ్డి అమ్మమ్మ ఊరు ఇది. కమ్యూనిస్టులను అవమానించిన కేసీఆర్ ఎన్నికల కోసం వాళ్ల కాళ్లు పట్టుకున్నారు. ఈ ప్రాంతానికి ఏం చేయని వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటేయలా?. చంటిపిల్లల పాలపై కూడా జీఎస్టీ వేసిన ఘనులు బీజేపీ వాళ్లు. తెలంగాణ ఇచ్చినందుకు, గిరిజనులకు భూములు పంచినందుకు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలి. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన మాకే మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు ఉంది. నేను మీలో ఒకడిని నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాగ్రెస్ పార్టీది." -రేవంత్ రెడ్డి 

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా 

పేదల నేస్తం కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న నమ్మకముందన్నారు.  ఒకప్పుడు టీడీపీలో ఉన్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తినన్నారు.  కాంగ్రెస్ గౌరవాన్ని నిలబెడతానని చెప్పారు.  మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి కోడలు 

చంద్రబాబు మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్ మనిషేనన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలు లాంటి వాడినన్నారు. పుట్టిల్లు టీడీపీ అయినా మెట్టినిల్లు కాంగ్రెస్‌లోకి వచ్చానని రేవంత్ వెల్లడించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టీడీపీలోకి వెళ్లారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పట్లో బిడ్డగా టీడీపీ గౌరవం నిలబెడితే ఇప్పుడు కోడలిగా కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానన్నారు.  మునుగోడు ఉపఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్ధతుగా సంస్థాన్ నారాయణ పురం మండలంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

Also Read : KTR Twitter: 'రూపాయి విలువ తగ్గిపోతుంటే, రేషన్ షాపులో మోదీ ఫొటో కోసం చూస్తున్నారా'

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Aus Huge Score VS Ind In 3rd T20: డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Aus Huge Score VS Ind In 3rd T20: డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Operation Safed Sagar Web Series : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 55 రివ్యూ... కత్తులు పొడిచి కళ్ళు తెరిపించిన నాగ్... దువ్వాడ మాధురితో పాటు ఆ ముగ్గురికీ దిమ్మతిరిగే కౌంటర్... లాస్ట్‌లో పొట్టపగిలే కామెడీ ట్విస్ట్
బిగ్‌బాస్ డే 55 రివ్యూ... కత్తులు పొడిచి కళ్ళు తెరిపించిన నాగ్... దువ్వాడ మాధురితో పాటు ఆ ముగ్గురికీ దిమ్మతిరిగే కౌంటర్... లాస్ట్‌లో పొట్టపగిలే కామెడీ ట్విస్ట్
Prasanth Varma : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 100 కోట్లు ఇవ్వాలి - ఫిలిం చాంబర్‌లో 'హనుమాన్' ప్రొడ్యూసర్ కంప్లైంట్
Embed widget