అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy : సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొన్నారు, కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

Komatireddy Rajagopal Reddy : తెలంగాణ గ్రామాల్లో ప్రజలకు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ రూ.200 కోట్లతో విమానం కొన్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారని, కానీ కేసీఆర్ కుటుంబం బాగుపడిందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గుండె నిండా ఎంత నిజాయితీతో రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీలో ఎన్నిసార్లు మొత్తుకున్నా తన నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గ సమస్యల కోసం అసెంబ్లీలో ఎక్కువ సేపు కొట్లాడానన్నారు. నిజంగా గుండె మీద చెయ్యి వేసుకుని మహిళలు చెప్పండి ఎనిమిదేళ్లలో మీ బతుకులు ఏమైనా మారాయా అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు

"టీఆర్ఎస్ వాళ్లు బీరు బిర్యానీ ఇచ్చి డబ్బులతో ఓట్లు కొనుక్కోవడానికి వస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇల్లులు కట్టేలేదు. కనీసం పేదవాళ్లకు ఇల్లు కట్టడానికి మూడు లక్షల రూపాయల ఇవ్వమని అడిగాను. రైతుబంధు భూస్వాములకు వద్దని చెప్పాను. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని మొత్తుకొని చెప్పాను.  సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వండి, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వండి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని అసెంబ్లీలో చెప్పినా వినకుండా  కోట్ల రూపాయలు భూస్వాములకు రైతుబంధు రూపంలో ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పైసలు పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలి కానీ ఇలా భూస్వాములకు ఉపయోగపడదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 90 మందిని గెలిపించి టిఆర్ఎస్ అధికారం ఇచ్చారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వం చేసే అన్యాయాన్ని అవినీతినిని అడగడానికి తెలంగాణ ప్రజలు 18 మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  గెలిపించారు. కానీ ప్రజల వైపు అడిగే వారి లేకుండా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించే వారే లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుక్కున్నారు కేసీఆర్. " -రాజగోపాల్ రెడ్డి 

అప్పుల కుప్పగా రాష్ట్రం 

మునుగోడు ప్రజల కోసం తన పదవిని త్యాగం చేసి రాజీనామా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేసిన మరుక్షణమే గట్టుప్పల్ మండలం ఏర్పాటు అయిందన్నారు. టీఆర్ఎస్ పాలన పోవాలని, ప్రజలకు మేలు చేయాలని పార్టీ మారానన్నారు.  కేసీఆర్... పెన్షన్ డబ్బులు ఆయన ఇంట్లో నుంచి, ఆయన జేబులో నుంచి  ఇవ్వడం లేదన్నారు. బీజేపీని గెలిపిస్తే పెన్షన్ రూ. 3000 ఇప్పిస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి అవసరమా? అంటూ నిలదీశారు. మంత్రికి ధైర్యం ఉంటే కేసీఆర్ తో మాట్లాడి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా అని చాలాసార్లు చెప్పానన్నారు. జగదీశ్ రెడ్డి మంత్రివే, కేటీఆర్ మంత్రినే కానీ కేటీఆర్ నియోజకవర్గం ఎలా ఉందో చూడాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు మంత్రి జగదీశ్ రెడ్డి  కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు వేల కోట్లకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల  రీడిజైన్ పేరు మీద సీమాంధ్ర కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.  గులాబీ కండువా కప్పుకోవాలని గ్రామాలలో నాయకుల్ని బెదిరిస్తున్నారన్నారు. 

కవితకు 600 మద్యం షాపులు! 

"మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోతారు. నాకు నమ్మకం ఉంది మీ పైన. వాళ్లు లక్ష రూపాయలు ఇచ్చినా తినిపించినా తాగిపిచ్చిన మీరు ధర్మం వైపు నిలబడతారు. ధర్మం వైపు నిలబడండి  మీకు అండగా నేనుంటా..  మునుగోడులోనే ఇల్లు కట్టుకొని మీకు అందుబాటులో ఉన్నా. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మునుగోడు ప్రజలు ఏమైనా అనాథలా? ఇక్కడ సరైన నాయకులు లేరా? అంటే మీరు నిలబెట్టిన అభ్యర్థి డమ్మీనా? మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. గ్రామాలలో తినడానికి తిండి లేదు ఉండడానికి గూడు లేదు కానీ రూ.200 కోట్లు పెట్టి కేసీఆర్ విమానం కొన్నాడట. మాటలు చెప్పి చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయడం లేదు కేసీఆర్. కవితమ్మ బతుకమ్మ ఆడి రూ.200 కోట్లు ముడుపులు ఇచ్చి 600 మద్యం షాపులకు ఓనర్ అయింది. రాబోయే కాలంలో మోదీ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధికారంలోకొస్తే మన కష్టాలని తొలగిపోతాయి."   -రాజగోపాల్ రెడ్డి 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget