అన్వేషించండి

Minister Niranjan Reddy: ప్రేమ‌లేఖ‌లు ఇచ్చేందుకో.. ప్రేమించేందుకో.. ఢిల్లీకి రాలేదు

వ‌రిధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ మాటిచ్చార‌ని.. దాని చూస్తున్నట్టు మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వాళ్ల నిర్ణయం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామన్నారు. 

ఢిల్లీలో ఉన్న టీఆర్ఎస్ నేతల బృందం కేంద్రంపై విమర్శలు గుప్పించింది.  వ‌రిధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ మాటిచ్చార‌ని.. అందుకోసమే లేఖ కోసం వేచి చూస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మెున్న మాటిచ్చి.. ఇప్పటి వరకు మళ్లీ స్పందించలేదని.. వారి నిర్ణయం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నామన్నారు. అంతేగాని.. ప్రేమ‌లేఖ‌లు ఇచ్చేందుకో.. ప్రేమించేందుకో.. ఢిల్లీకి రాలేదని అన్నారు. లక్షల మంది జీవితాలు.. ఇందులో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అన్నదాతల సమస్యలపై.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎందుకు లేదని ప్రశ్నించారు.

తెలంగాణ మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మలాక‌ర్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజ‌న్ రెడ్డి.. తెలంగాణ చేసిన త‌ప్పేంటి అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న సాహ‌సోపేత నిర్ణ‌యాలే తెలంగాణ‌లోని వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు నిద‌ర్శ‌నం అన్నారు.

వినూత్న విధానాలు, సహసోపేత నిర్ణయాలతోనే చరిత్రలో నిలిచిపోతామని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి నిర్ణయాలు..  తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమే చాలాసార్లు ప్రశంసించిందన్నారు. ఇప్పుడు కేంద్రమే రాజకీయ పార్టీగా వ్యవహరించటం సరికాదని వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యం తీసుకోమన్నందుకు ఒప్పుకుని.. రైతులకు కూడా వరి వేయొద్దని చెప్పామన్నారు. వానాకాలంలో పండిన ధాన్యం విషయంపై.. నోటితో చెప్పిన మాటను రాతపూర్వకంగా అడుగుతున్నామని చెప్పారు. 

కేంద్రంలోని అనేక శాఖలు తెలంగాణ పురోగతిని ప్రశంసించాయని.. వాళ్ల విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం ఏమైనా చేస్తుందని.. అన్నం పెట్టే అన్నదాతలను మాత్రం మరిచిపోతుందన్నారు. సుమారు 20 ఉత్పత్తులకే కేంద్రం నామమాత్రపు ఎంఎస్‌పీ ఇస్తోందని.. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోడీ చెప్పారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

Also Read: Crime News: బాచుపల్లిలో ఓ కళాశాల హాస్టల్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి.. యాజమాన్యంపై బంధువుల ఆరోపణలు

Also Read: Omicron Restrictions: దేశంలో ఒమిక్రాన్ ప్రకంపనలు... మళ్లీ రాష్ట్రాల్లో మొదలైన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు... మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Bhadrachalam Latest News: భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cisco: తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
తెలంగాణతోనూ సిస్కో ఒప్పందం - సీఎంతో భేటీ సమయంలో కనిపించని ఇప్పాల రవీంద్రారెడ్డి
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Bhadrachalam Latest News: భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
భద్రాచలంలో కుప్పకూలిన భవనం- ఆరుగురు మృతి
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
New Banking Rules: ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
ఈ ఏప్రిల్‌ నుంచి మారే బ్యాంకింగ్‌ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
Embed widget