Private Schools Fee: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
రాష్ట్రంలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ స్కూళ్లు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులు, వెబ్సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశించింది. రూల్స్ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Private Schools to Display Students Fee | హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొన్ని స్కూల్స్, కాలేజీలు ఏకంగా ప్రభుత్వ అధికారుల సంతకం ఫోర్జరీ చేసి మరీ పర్మిషన్ పొంది రన్ చేస్తున్నాయని గుర్తించడం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల స్కూల్ ఫీజుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులకు సంబంధించిన సమగ్ర వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ ప్రాంగణంలోని నోటీసు బోర్డులు, సంబంధిత స్కూల్ అధికారిక వెబ్సైట్లతో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో కూడా ఫీజుల స్ట్రక్చర్ను అందుబాటులో ఉంచాలని ఆదేశాలలో పేర్కొంది.
ఈ విద్యా సంవత్సరానికి (2026-27) సంబంధించి ఫీజు వివరాలను ప్రదర్శించని, అలాగే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్లకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ సూచించింది. ఆదేశాలను పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ, ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు (DEO)కు మార్గదర్శకాలు జారీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు























