అన్వేషించండి

KTR No Respect to Revanth Reddy: సభా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చినా సీట్లోంచి లేవని కేటీఆర్.. సోషల్ మీడియాలో చర్చ

తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్షనేత కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. ఆ సమయంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం తమ సీట్లో నుంచి లేవకపోవడం చర్చనీయాంశం అయింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు అత్యంత ఆసక్తికరమైన, హుందాతనంతో కూడిన సన్నివేశం చోటుచేసుకుంది. అదే సమయంలో జరిగిన ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోకి వచ్చిన సందర్భంలో ప్రతిపక్ష నేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయన యోగక్షేమాలను సరదాగా పలకరించారు. 

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నప్పటికీ, కేసీఆర్ తన సంస్కారాన్ని చాటుకుంటూ రేవంత్ రెడ్డి రాకను గమనించి వెంటనే లేచి నిలబడి ప్రతి నమస్కారం చేశారు. రేవంత్ రెడ్డికి స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి తన హుందాతనాన్ని ప్రదర్శించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, మరొకరి హోదాను గౌరవించుకుంటూ సాగిన ఈ అరుదైన కలయిక సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. రేవంత్ రెడ్డి చూపిన మర్యాద, కేసీఆర్ స్పందించిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ విమర్శలు..
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. సభా నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమీపంలోకి వచ్చినప్పుడు, తమ పార్టీ అధినేత వద్దకు వచ్చి పలకరించగా కేసీఆర్ లేచి నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే కేటీఆర్, కౌశిక్ రెడ్డి కనీసం లేచి నిలబడకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని వారు ఆరోపిస్తుంటే, బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం దీనిని గట్టిగా సమర్థిస్తున్నాయి.


KTR No Respect to Revanth Reddy: సభా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చినా సీట్లోంచి లేవని కేటీఆర్.. సోషల్ మీడియాలో చర్చ

తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని, రేవంత్ రెడ్డి చేసే నాటకాలకు కేటీఆర్ పడిపోరని వారు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇలా కేసీఆర్, రేవంత్ ల స్నేహపూర్వక పలకరింపు ఎంత హాట్ టాపిక్‌గా మారిందో, కేటీఆర్ స్పందించని తీరు సైతం అంతే స్థాయిలో రాజకీయ చర్చకు దారితీసింది.


KTR No Respect to Revanth Reddy: సభా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చినా సీట్లోంచి లేవని కేటీఆర్.. సోషల్ మీడియాలో చర్చ

సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారో కేసీఆర్‌నే అడగండి: రేవంత్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభలోని ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, అందులో భాగంగానే కేసీఆర్‌ను కలిసి పలకరించానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తానేదో ఈరోజే కొత్తగా కలవలేదని, గతంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించానని రేవంత్ గుర్తు చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ అసెంబ్లీ నుండి వెళ్ళిపోవడంపై స్పందించారు. కేసీఆర్ సభ నుంచి అంత త్వరగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఆయన్నే అడగాలని మీడియా వారికి సూచించారు. 

ఇద్దరు నేతలు కలుసుకున్న సమయంలో ఏం మాట్లాడుకున్నారనే విషయంపై మీడియా ప్రతినిధులు ఆరా తీయగా, రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్న విషయాలను బయట అందరికీ ఎలా చెబుతామని సరదాగా వ్యాఖ్యానించారు. శాసనసభ వేదికగా ఇద్దరు అగ్ర నేతలు కరచాలనం చేసుకుంటూ, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం సభలోని వారితో పాటు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, సభా సంప్రదాయాలను పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Embed widget