అన్వేషించండి

KCR Returns to Telangana Assembly: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన కేసీఆర్.. తాడోపేడో తేల్చుకునేందుకు అసెంబ్లీకి మాజీ సీఎం

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు.

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రమే ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. సోమవారం ఉదయం నందినగర్ నివాసం నుండి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కేసీఆర్ సభకు వస్తుండటంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

గతంలో కేసీఆర్‌ను సభకు రావాలని సవాల్ విసిరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తుండటంతో పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండేళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ సర్కార్‌ను గట్టిగా నిలదీయాలని, కృష్ణా జలాల సాధనపై ప్రభుత్వ వైఫల్యాలు లేవనెత్తాలని కేసీఆర్ ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రెడీ..

ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే నీటిపారుదల అంశంపై సుదీర్ఘ చర్చ జరగకుండా, కేవలం ఒక రోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది. మరోవైపు ఈ సమావేశాలను ఎక్కువ రోజులు సాగదీయకుండా 2, 3 రోజుల్లోనే ముగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో జ్యుడీషియరీ క్యాడర్ అధికారి ఆర్‌. తిరుపతి అసెంబ్లీ కార్యదర్శిగా వ్యవహరించడం ఒక ప్రత్యేకత. తొలిరోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వంటి ప్రక్రియ ఉంటాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసలు ఎజెండా ఖరారు కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, రైతు సమస్యలను సభ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. గత సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు మంత్రులు ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈసారి కేసీఆర్ రంగంలోకి దిగడంతో చర్చలు మరింత వాడిగా జరిగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ హయాంలోనే తప్పిదాలు అంటున్న కాంగ్రెస్

కృష్ణా జలాల పంపిణీ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరిస్తూ 2015లో చేసుకున్న ఒప్పందాన్ని సభలో గట్టిగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాటి అంతర్రాష్ట్ర సమావేశపు మినిట్స్‌లోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిప్పడం ద్వారా సభా సమయాన్ని పూర్తి చేయాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.

ఈ అంశంపై ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కసరత్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండి సాగునీటి రంగ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సభలో కృష్ణా జలాల పంపిణీ అంశం మినహా ఇతర అంశాలకు చర్చకు అవకాశం ఇవ్వకూడదని, అప్పటి ప్రభుత్వ వైఫల్యాలనే ఎండగట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Embed widget