అన్వేషించండి

KTR: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్

KTR Meets Kavitha : తీహార్ జైలులో ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవితను కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.

KTR: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన  బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో  ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఇటీవలే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. కవిత జూన్ 21వ తేదీ వరకు జైలులో రిమాండ్ లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి ఆమె తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరుగనుంది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. అయితే కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు  ప్రయత్నిస్తూనే ఉంది.

మార్చి 15న అరెస్ట్ 
ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది.  దాని పరిశీలించిన కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ  సప్లిమెంటరీ చార్జిషీట్‌ ను దాఖలు చేసింది. దానిపై కూడా కోర్టు విచారణ జరిపి రౌస్ ఎవెన్యూ కోర్టు జులై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఈడీ మే 10న ఈడీ దాదాపు ఎనిమిది వేల పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసిన ముగ్గురు ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానెల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను నిందితులుగా ఈడీ చార్జి షీట్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను మే 29న ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.   
 
అసలు ఢిల్లీ మద్యం కేసు ఏంటి ?  
2021 వరకూ ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం అమ్మేది. ఆ తర్వాత ఏడాది నుంచి ప్రైవేటుకు ఇవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ ఎంక్వైరీ వేయించారు. దీంతో మొత్తానికి ఆ పాలసీయే రద్దు చేసి, పాత పద్ధతిలోనే వెళ్లాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది.  2021 నవంబర్ నుంచి కొత్త పద్ధతి అమలయింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతి ప్రారంభించడంతోపాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. 

వ్యాపారులకు లాభాల పంట
 కొత్త పద్ధతి వల్ల గతం కన్నా ఎక్సైజ్ డిపార్టుమెంట్ కు 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది.  మద్యం రిటైలర్లు,  ఉచితాలు ఇస్తూ అమ్మకాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేట్ వారికి అప్పగించే క్రమంలో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి.  సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తర్వాత మనీష్ సిసోదియా ఇంటిలో సీబీఐ సోదాలు, కేసులో కవిత హస్తం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది. ఆప్ నాయకులకు రూ.100 కోట్లు చెల్లించి, అనుచిత ప్రయోజనాలను పొందేందుకు కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది.

టాప్ హెడ్ లైన్స్

ACB Raids On DSP Bheem Reddy: ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget