అన్వేషించండి

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

Nizamabad News KTR :  ఎన్నికలు ఎప్పుడయినా రావొచ్చు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. ఈ కీలక వ్యాఖ్యలు  చేశారు. కేంద్రం పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వస్తే తామూసిద్ధమన్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టె బడ్జెట్ లాస్ట్ బడ్జెట్ అన్నారు మంత్రి కేటీఆర్... మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్క యూనివర్సిటీ, ఒక్క ట్రిపుల్ ఐటి కూడా ఇవ్వలేదు. తెలంగాణకు కేంద్రo చిన్నచూపు చేస్తోందన్నారు కేటీఆర్. మోడీ మాటలేమో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ చేతలేమో సబ్ బక్వాస్ అన్నారు కేటీఆర్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా దేనిని పట్టించుకోవటం లేదు కేంద్రం. ఇక్కడ ఉన్న బిజెపి ఎంపీలకు తెలంగాణ పట్ల అంకితాభావం ఉంటే తెలంగాణకు న్యాయం చెయ్యమని మీ మోడీకి చెప్పాలని సూచించారు. 
 
రూ.2 లక్షల కోట్ల తెలంగాణ డబ్బులు పన్నుల రూపంలో కట్టాం... మన సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో సోకులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మనం కేంద్రానికి ఎక్కువ డబ్బులు పంపిస్తే... కేంద్రం నుంచి మనకు వచ్చేది తక్కువేనని తేల్చారు కేటీఆర్.  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తెలంగాణకు పక్కనే ఉన్నాయి. అవి బిజెపి పాలిత రాష్ట్రాలే... ఇక్కడ సంక్షేమ పథకాలు అక్కడున్నాయా... ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అక్కడ జరుగుతుందా అని ప్రశ్నించారు కేటీఆర్. మరి మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు లేవు అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఢిల్లీలో ఉండే వారు తెలంగాణకు అవార్డులు ఇస్తారు... గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శలు చేస్తారు అని అన్నారు కేటీఆర్. అసలు బిజెపి నాయకులకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. 


జాతీయ రహదారులు వేసి టోల్ టాక్సుల రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. మన డబ్బులతోనే రోడ్లు వేస్తున్నారు. కేంద్రం చేసిందేమీ లేదన్నారు. నరేంద్ర మోడీ కంటే ముందు 14 మంది ప్రధానులు పని చేశారు. వారుబీ60 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేశారు. నరేంద్ర మోడీ కేవలం 8 ఏళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు కేటీఆర్. ఇంత అప్పులు చేసి దేశానికి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. ఇంటింటికి నల్లా కోసం, ఉచిత కరెంట్ కోసం, ప్రాజెక్ట్ ల కోసం, రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అప్పులు చేశారు. అభివృద్ధి చేశారు. మీరు అప్పులు చేయటమే తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు కేటీఆర్.  రూ.400 ఉన్న సిలిండర్ రూ. 1100 చేసినందుకు మోడీ దేవుడా... నరేంద్ర మోడీ ఎవరికి దేవుడు... జిఎస్టీ వేసి నేతన్నలకు ఇబ్బంది పెట్టినoదుకు దేవుడా అని ఎద్దేవా చేశారు కేటీఆర్. 

మోడీ కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడని ఒకడంటాడు మరి సైంటిస్టులు ఏం చేశారని అన్నారు. ఢిల్లీ లో ఉన్న వాడు ఫెకుడు ఇక్కడున్నోడు జోకుడు...అని చమత్కారంగా మాట్లాడారు కేటీఆర్. సెస్ పెరు మీద 30 లక్షల కోట్ల రూపాయలు పేదల నుంచి వసూల్ చేసింది బిజెపి. బిజెపికి హిందూ, ముస్లిం తప్ప పనికోచ్చేది ఒక్కటి లేదన్నారు. మతాల మధ్య తగాదాలు పెట్టడమే వారికి తెలుసని విమర్శఇంచారు.  మోడీ కార్పొరేట్ మిత్రులకు రూ. 12 లక్షల కోట్లు మాఫీ చేశాడు. ఇది అబద్ధమని చెబితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.... అన్నారు కేటీఆర్. వెంటనే బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం చేసేలా బిజెపి ఎంపీలు కృషి చేయాలన్నారు కేటీఆర్.  

గత 8 ఏళ్లలో నిజామాబాద్ నగర అభివృద్ధికి 936 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రతి పక్ష పార్టీలకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి చేసిన లెక్కలు పక్కాగా ఉన్నాయి చూసుకోండని చెప్పారు కేటీఆర్. ఇటీవలే నిజామాబాద్ నగరానికి కేసీఆర్ 100 కోట్లు నిధులు మంజూరు చేశారు.   తిలక్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ లో అపురూపమైన చక్కటి ఆకృతిలో 50 కోట్లతో కళా భారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశాం... రాబోయే నెల రోజుల్లో నిజామాబాద్ నగరంలో  ఐటి హబ్ ప్రారంభించనున్నామని తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిధులతో మరింత అభివృద్ధి చేయాలని అన్నారు కేటీఆర్. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని  చెప్పే సత్తా మాకుందని అన్నారు కేటీఆర్. నిజామాబాద్ ఎంపీ ఒక్క రూపాయి నిధులైనా తెచ్చారా... అని ప్రశ్నించారు కేటీఆర్.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget