అన్వేషించండి

KCR At Telangana Bhavan: కాంగ్రెస్, టీడీపీ పాలనతో ఉమ్మడి పాలమూరుకు తీరని అన్యాయం: కేసీఆర్

KCR Press Meet In Telangana Bhavan | 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీ పాలనలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తీరని అన్యాయం, తీవ్ర నష్టం జరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

KCR At Telangana Bhavan | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో అత్యంత నష్టపోయిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని, ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చించాం. కొత్త తరం వాళ్లకు చాలా విషయాలు తెలియవు. దారుణ వివక్షకు గురైన జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్. వనరులు, వసతులు ఉన్నా జిల్లాను అన్యాయం చేశారు. కృష్ణా నది ఎంటర్ అయ్యేది, 300కు పైగా కిలోమీటర్లు ప్రవహించేది పాలమూరులోనే. అయినా 50 ఏండ్లు పాలించినా కాంగ్రెస్, తరువాత టీడీపీ పాలనలో పాలమూరును కోలుకోలేని దెబ్బ కొట్టాయి.

అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టులద్వారా ఆనాటికి 174 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపంగా మారింది. అందులో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది. ప్రతిపాదిత ప్రాజెక్టులను ఆపకూడదని ఎస్సార్సీ యాక్ట్ స్పష్టంగా చెప్పింది. కానీ అన్నింటిని నిలిపివేయడంతో అన్యాయం జరిగింది. మహబూబ్ నగర్ కు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతల కొత్తది కాదు. గతంలోనే ఉన్న ప్రాజెక్టుకు ఇప్పుడు జీవం పోశాం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను కలిసి సమస్యను ఎన్నో రకాలుగా వారి దృష్టికి తీసుకెళ్లాం. అయితే మీకు రాష్ట్ర హోదా లేదని అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోలేమని చెప్పారు.

బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన సమయంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి బచావత్ ఏమన్నారంటే.. ఈ ప్రాంతం నిరాదరణకు గురవుతోందన్నారు. కానీ ఎవరూ అడిగేవాళ్లు లేరని సుమోటాగా తీసుకుని జురాల ప్రాజెక్టు అనుమతి ఇచ్చారు. దాన్ని మరో చోటుకు మార్చవద్దని 17 టీఎంసీలకు కేటాయించారు. 1974 నుంచి 1978 వరకు పర్మిషన్లు వచ్చినా పట్టించుకోలేదు. అంజయ్య సీఎం అయ్యాక దానికి శంకుస్థాపన చేసి అనాథలా వదిలేశారు. బ్యారేజీ వరకు కట్టారు. కానీ కాలువలు లేవు. నీళ్లు పారుతున్నా రైతులకు నీళ్లు అందవు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని ప్రాజెక్టులకు శంకుస్థాపన, శిలాఫలకాలు వేశారు. ఆ రాళ్లను కృష్ణానదిలో అడ్డం పెడితే ఓ చెక్ డ్యాం అవుతుందని చెబితే ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్లు. నియోజకవర్గాలు, తాలుకాల నుంచి ముంబైకి వలస వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. 

దత్తత తీసుకుని పాలమూరును మోసం చేసిన చంద్రబాబు..

జిల్లాకు చెందిన కవి గోరటి వెంకన్న రైతుల సమస్యలు, నీటి కొరతపై పాటలు రాసి పాడారు. సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అని చంద్రబాబు సమావేశాల్లో చెప్పారు. జూరాలకు కొంత ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంది. మీరు దత్తత తీసుకున్న ప్రాంతమని నేను చంద్రబాబును అడిగితే రూ.13 కోట్లు కూడా కట్టలేదు. వదలకుండా నేను విమర్శలు చేస్తే తట్టుకోలేక చంద్రబాబు ఆ డబ్బులు కర్ణాటకకు కట్టారు. జోగులాంబ నుంచి గద్వాల వరకు తొలి పాదయాత్ర చేశాను. ఆర్డీఎస్ కెనాల్ 80 వేల ఎకరాలకు బదులు 10, 15 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందిస్తుంది. కర్ణాటకకు వెళ్లి కాలువ చెక్ చేశాకే మాట్లాడాను. జూరాల నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ అని చంద్రబాబు డ్రామాలు చేశారు. కానీ చుక్క నీళ్లు ఇవ్వలేదని’ కేసీఆర్ ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
Advertisement

వీడియోలు

Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
పోలవరం - నల్లమలసాగర్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. లీగల్‌ టీంతో మంత్రి నిమ్మల సమీక్ష
PM Modi in Somnath: గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
గజనీ, ఔరంగజేబులు మట్టిలో కలిసిపోయారు.. సోమనాథ్ ఆలయం అలాగే ఉంది: ప్రధాని మోదీ
India vs New Zealand 1st ODI: కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
కాన్వే- నికోల్స్ హాఫ్ సెంచరీలు, మెరిసిన డారిల్ మిచెల్.. భారత్ టార్గెట్ 301
The Raja Saab Cast Fees : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? - హారర్ ఫాంటసీ మూవీకి తగ్గించిన డార్లింగ్!
Cheapest Automatic 7 Seater Car: అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
అతి చవకైన ఆటోమేటిక్ 7 సీటర్ కారు.. బడ్జెట్ ధరలో ఫ్యామిలీ కారు కొనేయండి
Pawan Kalyan : పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
పవన్ కల్యాణ్ అరుదైన ఘనత - 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' టైటిల్... పవర్ స్టార్ రికార్డు హిస్టరీ
Rishabh Pant Ruled Out: వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
వన్డే సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్‌కు ఛాన్స్
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
Embed widget