అన్వేషించండి

TGRTC AI Services : టీజీఆర్టీసీ సేవల్లో AI విప్లవం 40 వేల మంది సిబ్బంది ఆరోగ్యం నుంచి బస్సుల షెడ్యూలింగ్ వరకు భారీ మార్పులు 

TGRTC AI Services : టీజీఆర్టీసీ సంచలన మార్పులకు శ్రీకారం చుడుతోంది. 40 వేల మంది సిబ్బంది ఆరోగ్యం నుంచి బస్సుల షెడ్యూలింగ్ వరకు అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు వాడుకోనుంది.  

TGRTC AI Services : ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ఉంది. కేవలం ఐటీ రంగాలకే పరిమితం కాకుండా, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సాంకేతికతను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) రెగ్యులర్‌ బిజినెస్‌లోకి విజయవంతంగా తీసుకువచ్చింది. కేవలం ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, అంతర్గత సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం, ముఖ్యంగా సిబ్బంది ఆరోగ్యస్థితిని అత్యంత ఆధునిక పద్ధతిలో పర్యవేక్షించడం వంటి బహుళ ప్రయోజన లక్ష్యాలతో ఆర్టీసీ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

టీజీఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ఏఐ ప్రాజెక్ట్ ఒక సమగ్రమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. సంస్థ ప్రకటన ప్రకారం, తమ ఉత్పాదకతను పెంపొందించుకోవడంతో పాటు, సిబ్బంది ప‌నితీరును మెరుగుపరుచుకోవడం, వారి ఆరోగ్య స్థితిని ప‌ర్యవేక్షించడం దీని ముఖ్య ఉద్దేశాలుగా కనిపిస్తున్నాయి. ప్రజలకు మరింతగా సేవలను అందించేందుకు, రద్దీకి అనుగుణంగా బస్సు స‌ర్వీసులను ఏర్పాటు చేయడం కోసం ఏఐ ఉపయోగించనున్నారు. మానవ వనరుల సంక్షేమం, ఆపరేషనల్ ఎఫిషియెన్సీని ఒకే తాటిపైకి తీసుకురావడంలో టీజీఆర్టీసీ లేటెస్ట్ సాంకేతికతను వాడుకుంటోంది.  

సాంకేతిక భాగస్వామ్యం, విజయవంతమైన అమలు వ్యూహం

ఏఐ ప్రాజెక్టుల అమలు అనేది కేవలం సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడంతో చేతులు దులుపుకునే ప్రక్రియ కాదు. దానికి సరైన సాంకేతిక పరిజ్ఞానం, లోతైన నైపుణ్యం, పటిష్టమైన ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహం అవసరం. ఈ కీలకమైన అంశాలలో టీజీఆర్టీసీకి హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ తోడ్పాటు అందిస్తోంది. ఈ కంపెనీ భాగస్వామ్యం ద్వారా, సాంకేతిక సలహాలు, నైపుణ్యం వ్యూహాలను అందించి, ఏఐ వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని డిపోల్లోనూ సులభంగా అమలు జరిగేలా ఆర్టీసీ ప్లాన్ చేసింంది.  

అంతేకాకుండా, కేవలం బయటి నిపుణులపై ఆధారపడకుండా, సంస్థాగతంగా ఏఐ వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు యాజమాన్యం ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. సంస్థలో సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారుల‌ను గుర్తించి, వారికి ఈ టీమ్‍లో ప్రాధాన్యం కల్పించారు. ఈ ప్రత్యేక టీమ్ సభ్యులకు హన్స ఈక్విటీ పార్ట్ నర్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇది, భవిష్యత్తులో ఆర్టీసీ పూర్తిగా సాంకేతికతను తమ అదుపులోకి తీసుకునేందుకు చేస్తున్న అంతర్గత పెట్టుబడిగా చూడవచ్చు.

ఏఐతో సిబ్బంది సంక్షేమం: 40 వేల మంది ఆరోగ్య పర్యవేక్షణ

సాధారణంగా ఏఐ అంటే మొదటగా ఆపరేషనల్ లేదా కస్టమర్ సేవల్లో వినియోగాన్నే ఊహించుకుంటాం. కానీ, టీజీఆర్టీసీ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రత్యేకమైన, విలువైన అంశం ఏమిటంటే తమ 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని ఏఐ ద్వారా పర్యవేక్షించడం. 

'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్'లో భాగంగా ఉద్యోగుల‌కు చేసిన వైద్య ప‌రీక్షల డేటాను ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ML) స‌హ‌కారంతో విశ్లేషిస్తున్నారు. ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా సిబ్బంది ఆరోగ్య ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసేందుకు అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు, ఒక డ్రైవర్ లేదా కండక్టర్ భవిష్యత్తులో గుండె సంబంధిత లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటే, ఏఐ ఆ రిస్క్‌ను గుర్తించి హెచ్చరించగలదు. తద్వారా నివారణ చర్యలు తీసుకోవడానికి, సకాలంలో వైద్య సలహా అందించడానికి వీలు కలుగుతుంది.

మొదటగా, ఈ ఆరోగ్య పర్యవేక్షణ ప్రాజెక్ట్‌ను ఆరు డిపోల్లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా అమ‌లు చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఫ‌లితాలు అత్యంత సానుకూలంగా ఉండటంతో, ప్రస్తుతం ఈ కీలకమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని డీపోల్లోనూ అమలు చేస్తున్నారు. ఇది ఉద్యోగుల భద్రతకు, పనితీరుకు ఎంతో కీలకం. ఆరోగ్యంగా ఉన్న సిబ్బంది మాత్రమే రోడ్డుపై సురక్షితమైన సేవలను అందించగలరు.

ప్రయాణీకుల రద్దీ అంచనా, ఆటోమెటిక్ షెడ్యూలింగ్

ఆర్టీసీ కార్యకలాపాలలోకి విస్తృతంగా ఏఐని వినియోగించుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో అత్యంత ముఖ్యమైన మార్పు ఆటోమెటిక్ షెడ్యూలింగ్. త్వరలోనే ఏఐ ద్వారా బస్సుల షెడ్యూలింగ్‌ను పూర్తిగా ఆటోమెటిక్ చేసేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రస్తుతం మాన్యువల్‌గా లేదా సంప్రదాయ పద్ధతుల్లో రవాణా షెడ్యూల్స్ తయారు చేయడం జరుగుతుండగా, ఏఐ ప్రవేశంతో ఇది పూర్తి డేటా ఆధారితంగా మారుతుంది. ఏఐ వ్యవస్థ.. ఆ రోజు ఏ వారం, ఏమైనా పండుగలు ఉన్నాయా అనే అంశాల ఆధారంగా ప్రయాణికుల రద్దీని అత్యంత కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. అంచనా వేసిన రద్దీకి అనుగుణంగా, అదనపు బస్సులను ఏ డిపో నుంచి, ఏ రూట్‌లో, ఏ సమయాల్లో ఏర్పాటు చేయాలో నిర్ణయించేలా ప్లాన్ చేస్తున్నారు.

దీని వలన రెండు ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయి:

1. ఖర్చుల తగ్గింపు: రద్దీ లేని సమయాల్లో అనవసరంగా బస్సులు నడపాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ఇంధనం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.

2. ప్రజా సంతృప్తి: రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో, పండుగలు లేదా ప్రత్యేక రోజుల్లో ప్రయాణికులకు సకాలంలో బస్సులు అందుబాటులో ఉంటాయి, దీంతో సేవలు మరింత ప్రజానుకూలంగా మారతాయి.

మంత్రి అభినందనలు, భవిష్యత్తు మార్గదర్శకాలు

ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఏఐ ప్రాజెక్టు అమలు తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంస్థ పనితీరు మెరుగుపరచుకోవడానికి ఏఐని వినియోగించుకోవ‌డంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఆర్టీసీ ఉన్నతాధికారులను అభినందించారు కూడా.

ఆర్టీసీ పురోగతికి, ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి సమష్టిగా ప‌ని చేయాలని, సంస్థ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ రాజకీయ మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహం టీజీఆర్టీసీ ఏఐ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

సాంకేతిక యుగంలో ఆర్టీసీ ముందడుగు

టీజీఆర్టీసీ తీసుకున్న ఈ ఏఐ నిర్ణయం కేవలం ఒక సాంకేతిక అప్డేట్ మాత్రమే కాదు, ఇది సంస్థ భవిష్యత్తు దృష్టికి, సిబ్బంది సంక్షేమానికి, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు, 40 వేల మంది సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా మానవ వనరుల విలువను పెంచగా, ఆటోమెటిక్ షెడ్యూలింగ్ ద్వారా ప్రజా రవాణాను మరింత సమర్థవంతంగా, ఖర్చు తగ్గించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా చరిత్రలో ఈ ఏఐ అడాప్షన్ ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. మిగిలిన రాష్ట్రాల ఆర్టీసీలకు కూడా ఇది ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. అధికారులు మంత్రి సూచనలను పాటిస్తూ, ఏఐ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తే, టీజీఆర్టీసీ కచ్చితంగా మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది అనడంలో సందేహం లేదని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget