అన్వేషించండి

Telangana Assembly: స్పీకర్ నిర్ణయంపై ట్రిపుల్ ఆర్ అసంతృప్తి, జనం నవ్వుకొనే రోజు వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వ, స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. తమ సస్పెన్షన్‌పై కోర్టు సూచన కూడా పట్టించుకోలేదన్నారు.

హైకోర్టు చెప్పినప్పటికీ సభలోకి తమను అనుమతించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. బడ్జెట్ సందర్భంగా తాము ఎలాంటి ఆటంకం కలిగించలేదన్న నేతలు.. ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కాలేదన్నారు. 

ఇందిరా పార్క్‌ వద్ద దీక్ష

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17 న ఇందిరా పార్క్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తామన్నారు బీజేపీ శాసనసభ్యులు. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టిన ఎమ్మెల్యేలు రాజసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు.. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ఎలాంటి ఆందోళన చేయకపోయినా తమ ముగ్గుర్ని సస్పెండ్ చేశారని.. ఇదే విషయాన్ని స్పీకర్‌కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 

కోర్టు సూచన కూడా పట్టించుకోలేదు

దేశంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పదవులు, బాధ్యతలు అన్నీ అంబేడ్కర్ అందించిన ఫలాలే అన్న ఈటల రాజేందర్ ఆ పదవులు అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా వ్యవహారిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. తమ విషయంలో కూడా స్పీకర్ చైర్ కి విలువ ఇస్తూ కోర్టు సూచన చేసిందన్నారు. కానీ ఆ స్పూర్తిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. స్పీకర్ తన గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని విమర్శించారు. 

నిరంకుశ ధోరణి

స్పీకర్‌, ప్రభుత్వం అనుసరించే ఈ పద్దతి నిరంకుశత్వానికి దారి తీస్తుందన్నారు మాజీ మంత్రి ఈటల. తాను పాతికేళ్లలో చాలా మంది స్పీకర్లను, సీఎంలను చూశానన్న రాజేందర్... ఇలాంటి నిరంకుశ ధోరణి ఎప్పుడూ చూడలేదన్నారు. 2008 నుంచి 2014 వరకు శాసన సభ పక్ష నేతగా ఉండి గౌరవం తీసుకొచ్చానని గుర్తు చేశారు. తమ సస్పెన్షన్ పై సభ అభిప్రాయం మళ్లీ తెలుసుకోమని కోరినా స్పీకర్ స్పందించలేదని ఆరోపించారు. 

నార్త్ కొరియా గుర్తుకు వస్తుంది

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టే విధానాలు చూస్తే నార్త్ కొరియా గుర్తు వస్తుందని ఘాటు విమర్శలు చేశారు రాజేందర్. అక్కడ రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు చప్పట్లు కొట్టలేదని ఒక సభ్యున్ని కాల్చి చంపారని.. ఇక్కడ కూడాలా అలాంటి సీన్స్ చూస్తున్నామన్నారు. ఆస్ట్రియా బృందం అసెంబ్లీ వ్యవహారాలు పరిశీలిస్తున్న టైంలో బీజేపీ లీడర్ల సస్పెన్షన్ దురదృష్టకర సంఘటనగా 
అభివర్ణించారు.

ఉద్యమ ద్రోహులతో 

భవిష్యత్‌లో చప్పట్లు కొట్టలేదని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఈటల ఎద్దేవా చేశారు. ఉద్యమ నాయకుణ్ని ఉద్యమాన్ని తూలనాడిన వారితో సస్పెండ్ చేయించి మరింత అవమానపరిచారన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టు ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలి అని సీఎం కోరడం ఇందుకేనేనో అనిపిస్తోందన్నారు. చైనాలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు మాయమయ్యేవారని కేసిఆర్ చెప్పేవారని... ఇక్కడ కూడా అలాంటివి చేద్దాం అనుకున్నట్టున్నారని మండిపడ్డారు.అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తానే చక్రవర్తి, తానే రాజులాగా పాలన చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. 

మూల్యం చెల్లించుకోక తప్పదు

కేసీఆర్ చేస్తున్నదానికి మూల్యం చెల్లించుకోక తప్పని హెచ్చరించారు ఈటల రాజేందర్. అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని వాళ్లే బుద్ది చెబుతారన్నారు. అహంకారాన్ని పూడ్చిపెట్టే రోజులు దగ్గరే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.సిగ్గుతో తల దించుకునే పరిస్థితి కేసిఆర్ తీసుకువచ్చారన్నారు. ఇవన్నీ ప్రజానీకం గుండెలో పెట్టుకొని సరైన సమయంలో కర్రుకాల్చి వాతపెడతారని అభిప్రాయపడ్డారు.

నవ్వుకునే రోజు వస్తుంది

హైకోర్టు ఉత్తర్వులు, తమ అభ్యర్థన పూర్తిగా పరిశీలించిన తరువాత తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ చెప్పారని.. అయితే సభలో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలని కోరినా వినిపించుకోలేదన్నారు మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావు. చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజు. స్పీకర్ ఉదేశపూరకంగానే మౌనంగా వ్యవహరించారని మండిపడ్డారు. తనకు వచ్చిన డైరెక్షన్ మేరకే పని చేస్తున్నారన్నారు. కచ్చితంగా మిమ్మల్ని చూసి నవ్వుకునే రోజు వస్తుందని నాడు వాజ్‌పేయీ చెప్పిన మాటలు గుర్తు చేశారు రఘునందన్‌. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget