అన్వేషించండి

Danam Nagender: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై దానం నాగేందర్ క్లారిటీ

Telangana News: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు.

Secunderabad: ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపామున్షీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. వారిద్దరికి దీపామున్షి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా దానం నాగేందర్ పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే లోక్‌సభ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ హస్తం పార్టీలో చేరారనే చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై దానం నాగేందర్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.

పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం లేదని, మీడియాతో జరిగే ప్రచారం అవాస్తవమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం కార్యకర్తలు, అనుచరులతో దానం భేటీ అయ్యారు. వారితో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ సారి మరోసారి సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు టికెట్ ఖరారు అయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరిదనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

కిషన్ రెడ్డిక పోటీ ఎవరంటే.. 
ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. దీంతో దానం నాగేందర్‌ను బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను దానం ఖండిస్తున్నారు.  తొలుత ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావించింది. కానీ కిషన్ రెడ్డికి పోటీగా బలమైన నేతను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా దానం నాగేందర్ పేరును పరిశీలించినట్లు వార్తలొస్తున్నాయి. దానం నాగేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చేది ఎవరికో? 
రాజకీయాల్లో సీనియర్ నేతగా దానం నాగేందర్‌కు పేరుంది. దీంతో కిషన్ రెడ్డికి పోటీగా ఆయన అయితే బాగుంటుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. కానీ దానం మాత్రం పోటీకి దిగేందుకు ఆసక్తిగా లేరని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షేట్కర్ పేర్లను ఖరారు చేసింది. సోమవారం  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూడో జాబితాపై చర్చించి ఆమోదం తెలపనుంది. అనంతరం మూడో జాబితాను ప్రకటించే అవకవాశముందని తెలుస్తోంది.

మూడో జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించనున్నారని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా ఈ జాబితాలో చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. ఇక చేవెళ్ల ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది. ఏఐసీసీలో ఆయనకు ఏదైనా కీలక పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!
MLC Shambhipur Raju: కేటీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు తీవ్ర గాయాలు.. కిమ్స్ ఆసుపత్రికి తరలింపు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Embed widget